ఉగ్రదాడి: ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
కుప్వారా: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సోమవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లతో పాటు ఓ ఉగ్రవాది మరణించాడు. ఆరు మంది జవాన్లకు గాయాలైనాయి.
కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని బీఎస్ఎఫ్ బలగాలకు సమాచారం వచ్చింది. సోమవారం భద్రతా దళాలు ఆ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి.

లొంగిపోవాలని ఉగ్రవాదులను భద్రతా దళాలు హెచ్చరించాయి. ఆ సందర్బంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు.
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది అంతం అయ్యాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది గురించి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications