వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడి: ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

|
Google Oneindia TeluguNews

కుప్వారా: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సోమవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లతో పాటు ఓ ఉగ్రవాది మరణించాడు. ఆరు మంది జవాన్లకు గాయాలైనాయి.

కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని బీఎస్ఎఫ్ బలగాలకు సమాచారం వచ్చింది. సోమవారం భద్రతా దళాలు ఆ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి.

Three BSF personnel.militant killed in Kashmir

లొంగిపోవాలని ఉగ్రవాదులను భద్రతా దళాలు హెచ్చరించాయి. ఆ సందర్బంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు.

భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది అంతం అయ్యాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది గురించి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

English summary
Three BSF personnel, including an officer, and a militant were killed on Monday in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X