ఉగ్రదాడి: ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

కుప్వారా: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సోమవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లతో పాటు ఓ ఉగ్రవాది మరణించాడు. ఆరు మంది జవాన్లకు గాయాలైనాయి.

కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని బీఎస్ఎఫ్ బలగాలకు సమాచారం వచ్చింది. సోమవారం భద్రతా దళాలు ఆ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి.

Three BSF personnel.militant killed in Kashmir

లొంగిపోవాలని ఉగ్రవాదులను భద్రతా దళాలు హెచ్చరించాయి. ఆ సందర్బంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు.

భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది అంతం అయ్యాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది గురించి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+