క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి ఆరుగురు మృత్యువాత
ఒరిస్సా: క్రికెట్ మైదానంలో పిడుగుపడి ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఒడిశాలోని కుర్దా జిల్లాలోని జరిపాద గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గ్రామంలోని యవకులు రెండు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడుకుంటుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం పడింది.
దీంతో యువకులు సమీపంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి తలదాచుకున్నారు. అదే సమయంలో యువకులు ఉన్న ఇంటిపై పిడుగు పడింది. ఒక్కసారిగా పడిన పిడుగుతో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని కుర్దాలోని తంగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ తరలించారు. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications