క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి ఆరుగురు మృత్యువాత
ఒరిస్సా: క్రికెట్ మైదానంలో పిడుగుపడి ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఒడిశాలోని కుర్దా జిల్లాలోని జరిపాద గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గ్రామంలోని యవకులు రెండు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడుకుంటుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం పడింది.
దీంతో యువకులు సమీపంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి తలదాచుకున్నారు. అదే సమయంలో యువకులు ఉన్న ఇంటిపై పిడుగు పడింది. ఒక్కసారిగా పడిన పిడుగుతో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని కుర్దాలోని తంగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ తరలించారు. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
More From
-
ఫైనల్లో హై-వోల్టేజ్ డ్రామా: అర్ష్దీప్, మిచెల్ మధ్య గొడవ! వీడియో -
ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే!












Click it and Unblock the Notifications