ఈడీ భయం.. ఫోన్ డ్రైనేజీలో పడేసి.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే
సాధారణంగా పోలీసుల్ని చూసినప్పుడు దొంగలు కూడా ఇలాగే పారిపోతుంటారు. గోడలు, గేట్లు దూకి అక్కడి నుంచి తప్పించుకుంటారు. అయితే వెస్ట్ బెంగాల్ లో ఇలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులకు బయపడిన ఓ ఎమ్మెల్యే ఏకంగా బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచే దూకేశారు. ఫోన్ ను డ్రైనేజీలో పడేశారు. అయితే ఎట్టకేలకు ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జిబన్ కిషన్ సాహా చేష్టలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. రాష్ట్రంలో జరిగిన టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో భాగంగా అతడ్ని విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు ముర్షిదాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటిపై రైడ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిషన్ సహా.. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేసి డ్రైనేజీలో ఫోన్ పడేసి పొలాల్లోకి పరిగెత్తుతూ తప్పించుకునేందుకు యత్నించారు. కానీ అతడ్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పశ్చిమ బెంగాల్ లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంపై ED అధికారులు.. ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కిషన్ సాహా, అతడి కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బందిపై తీవ్ర అభియోగాలు మోపారు. టీచర్ల రిక్రూట్ మెంట్ భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ పేర్కొంది.

ఈ మేరకు ఎమ్మెల్యే కిషన్ సాహా ఇంటితోపాటు అతని సన్నిహితుల రహస్య ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. దాడుల గురించి తెలుసుకున్న సాహా.. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేసి డ్రైనేజీలో ఫోన్ పడేసి పొలాల్లోకి పరిగెత్తుతూ తప్పించుకునేందుకు యత్నించారు. కానీ అతడ్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన బట్టలు మొత్తం బురదతో నిండిపోయాయి. డ్రైనేజీలో వేసిన ఫోన్ లను సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ టెస్టుకు పంపించారు. ఈ స్కామ్ లో ఇప్పటికే పలువురు అధికారులపై ఈడీ దర్యాప్తు నిర్వహించింది.
-
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications