'ఢిల్లీ జూ' తెల్లపులిపై దయ చూపండంటున్న హీరోయిన్
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ జూలో తెల్లపులి ఎన్ క్లోజర్లో పడిపోగా ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి చంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పులిని చంపేయాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.
ఐతే మరికొందరు మాత్రం ఈ పులిపై జాలిపడుతున్నారు. అలాంటి వారికి మద్దతుగా త్రిష, లావణ్య త్రిపాఠి రంగంలోకి దిగారు. ఈ తెల్లపులిపై దయ చూపాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో త్రిష పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జంతువుల కోసం పోరాడే 'పెటా' సంస్దలో హీరోయిన్ త్రిష వాలంటీర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్క్లోజర్లో పడిన విద్యార్థి... తనను ఏం చేయవద్దంటూ కొద్ది నిమిషాల సేపు పులిని ప్రాధేయపడిన సంఘటన అందరినీ కదిలించింది. చనిపోవడానికి ముందు అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
యువకుడిని పొట్టన పెట్టుకున్న పులి పేరు విజయ్. 2007లో జన్మించిన దీని బరువు 200 కిలోలు. ఇది రోజుకు పది కిలోల మాంసం తింటుంది. పులి ఉండే ఆవరణలో ఆ యువకుడు పడినా కాసేపటి వరకు పులి అతని పైన దాడి చేయలేదని, ఇంతలో దాని పైకి రాళ్లు విసరడంతో దాడికి పాల్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత పులిని చూసేందుకు ఆ జూకు పెద్ద ఎత్తున వీక్షకులు తరలి వస్తున్నారట. విద్యార్థిని పులిని చంపిన సంఘటన మంగళవారం జరిగింది. ఆ తర్వాత రోజు నుండి చాలామంది ఆ తెల్లపులిని చూసేందుకు వస్తున్నారట.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications