Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Breaking : మధ్యప్రదేశ్ లో కూలిన రెండు ఎయిర్ ఫోర్స్ జెట్స్-ట్రైనింగ్ లో అపశృతి..

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు ఎయిర్ ఫోర్స్ జెట్లు కుప్పకూలాయి. భారత వాయుసేన నిర్వహిస్తున్న ట్రైనింగ్ లో పాల్గొంటున్న ఈ రెండు జెట్లు కుప్పకూలడంతో ఘటనా స్ధలంలో భీతావహ పరిస్ధితి నెలకొంది.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఇవాళ ఓ విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్ సు-30, మిరాజ్ 2000 శిక్షణ సమయంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి శిక్షణ కోసం బయలుదేరాయి. శిక్షణలో పాల్గొంటున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు విమానాలు పరస్పరం ఢీకొని కుప్పకూలాయా లేక విడివిడిగానే కుప్పకూలాయా అన్న దానిపై ఎయిర్ ఫోర్స్ వివరాలు సేకరిస్తోంది.

మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఈ రెండు విమానాలు ప్రమాదవశాత్తూ కుప్పకూలాయి. అయితే ఒకేసారి రెండు విమానాలు ఎలా కుప్పకూలాయన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఖోయ్-30లో ఇద్దరు పైలట్లు, మిరాజ్ 2000 విమానంలో ఒకరు ఉన్నారు. పైలట్‌లలో ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, మూడవ పైలట్‌ను రక్షించడానికి ఓ ఛాపర్‌ పంపినట్లు తెలుస్తోంది. ఈ రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయా లేదా అనే అంశాన్ని తేల్చడానికి ఐఏఎఫ్ కోర్టు విచారణ ప్రారంభించింది


two indian air force jets crashed in bhopal during training exercise-here are details
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+