డిజిటల్ ప్రోత్సాహం: బీమ్ యాప్లో క్యాష్బ్యాక్ ఆఫర్స్, రిఫరల్ బోనస్
ప్రజలకు దీన్ని మరింత చేరువ చేసేందుకు రిఫరల్ బోనస్, క్యాష్బ్యాక్ పథకాలను తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం తీసుకొచ్చిన బీమ్ యాప్ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. బుధవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన ఈ అంశంపై స్పందించారు.
ఇప్పటికే ఈ యాప్ను కోటీ 25లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఆయన చెప్పారు. ప్రజలకు దీన్ని మరింత చేరువ చేసేందుకు రిఫరల్ బోనస్, క్యాష్బ్యాక్ పథకాలను తీసుకురానున్నట్లు తెలిపారు.

డిజిటల్ ఆర్థికవ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూనే దీనివల్ల సామాన్యుడికి ఎన్నో లాభాలు ఒనగూరుతాయని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ బీమ యాప్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. గూగుల్ ప్లే స్టో ర్ నుంచి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications