Udaipur: టైలర్ హత్య దెబ్బతో 32 మంది ఐపీఎస్ అధికారుల పైవేటు, లిస్ట్ లో ఐజీ, సీరియస్ !
ఉదయ్ పూర్/రాజస్థాన్: ఇస్లాం మతాన్ని అవమానించారని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను అతి కిరాతకంగా హత్య చెయ్యడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కన్హయ్య లాల్ హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నా రాజస్థాన్ లో పరిస్థితి అదుపులోకి రాలేదు. కన్హయ్య లాల్ హత్య కేసు దెబ్బతో రాజస్థాన్ లో 32 మంది ఐపీఎస్ అధికారుల మీద బదిలీ వేటు పడింది.
ఆరోజు కేసు పెట్టిన కన్హయ్య లాల్
టైలర్ కన్హయ్య లాల్ హత్యతో ఉదయ్ పూర్ రగిలిపోతాఉంది. ఉదయ్ పూర్ లో ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉంది. నెల రోజుల పాటు రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే కన్హయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏమాత్రం పట్టించుకోని పోలీసులు
ఆ రోజు కన్హయ్య లాల్ కేసు పెట్టిన వ్యక్తులను అరెస్టు చేసి ఉంటే అతన్ని హత్య చెయ్యడానికి చాన్స్ ఉండేదికాదని, ఉదయ్ పూర్ లో అల్లర్లు జరగడానికి అవకాశం ఉండేదికాదని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కన్హయ్య లాల్ కేసులో నిర్లక్షం చేసిన ఏఎస్ఐ మీద ఇప్పటికే రాజస్థాన్ పోలీసు అధికారులు వేటు వేశారు.
Recommended Video
32 మంది ఐపీఎస్ ల మీద బదిలి వేటు
కన్హయ్య లాల్ హత్య కేసును కేంద్ర హోమ్ శాఖ సీరియస్ గా తీసుకోవడంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. పోలీసు అధికారుల నిర్లక్షం కారణంగా కన్హయ్య లాల్ హత్య జరిగిందని ఏన్ఐఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసు దెబ్బతో ఉదయ్ పూర్ ఏడీజీపీ, ఎస్పీతో పాటు మొత్తం 32 మంది పోలీసుల అధికారుల మీద బదిలీ వేటుపడింది.