Asad Encounter: అసద్ ఎన్కౌంటర్ ఉమేశ్ పాల్కు ఘనమైన నివాళి..!
యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినా తర్వాత మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీలకు చుక్కలు చూపిస్తున్నారు. అతిగా చేస్తే ఎన్ కౌంటర్ చేసిపారేస్తున్నారు. తాజాగా లోక్సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్ నిందితుడిగా ఉన్నాడు. అసద్ ను పోలీసులు ఝాన్సీ వద్ద ఎన్కౌంటర్ చేశారు. గురువారం అతిఖ్ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది.
అసద్ ఎన్ కౌంటర్ పై ఉమేశ్ పాల్ తల్లి ఆనందం వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ధన్యవాదాలు తెలిపారు. అసద్ మరణం నా కొడుకు మరణానికి ఇచ్చిన నిజమైన నివాళి అని అన్నారు. సీఎం యోగిపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ అనే లాయర్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉమేశ్ను ప్రయాగ్రాజ్లోని ఆయన ఇంటి వద్ద చంపేశారు.


-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications