స్మృతి ఇరానీకి షాక్: ట్రయల్ రూంలో రహస్య కెమెరా, ఫిర్యాదు
పనాజీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది! గోవాలోని ఓ స్టోర్ రూంలో దుస్తులు కొనుగోలు చేసిన స్మృతి ఇరానీ అనంతరం వాటిని మార్చుకునేందుకు ట్రయల్ రూంకు వెళ్లారు. ట్రయల్ రూంలో ఆమె రహస్య కెమెరాలను గుర్తించారు.
దీంతో షాకైన స్మృతి ఇరానీ పోలీసులకు సమాచారం అందజేశారు. కేంద్రమంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ వెళ్లిన స్టోర్లోనే స్పై కెమెరాలు ఉండటం గమనార్హం. స్మృతి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించారు. అలాగే, గోవాలోని మిగతా స్టోర్ రూంలలో ఇలాంటి స్పై కెమెరాలు ఉన్నాయా అని గుర్తించే పనిలో పడ్డారు.

స్మృతి ఇరానీ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. సెలవులు గడిపేందుకు వెళ్లిన స్మృతి అక్కడి ఫ్యాబ్ ఇండియా అనే దుకాణంలో దుస్తులు కొనుగోలు చేశారు. ఆ దుకాణంలోని ట్రయల్ రూంలో ఆమెకు స్పై కెమెరా కనిపించింది.
మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన నేరం పైన పోలీసులు స్టోర్ యాజమాన్యం పైన కేసులు పెట్టారు. స్మృతి ఇరానీ ఈ విషయాన్ని తొలుత స్థానిక బీజేపీ నేత మేకేల్ లోబోకు చెప్పారు. అనంతరం స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications