వాట్సాప్ లో అసభ్య మేసేజ్ :సెల్పీ పంపి , ఆత్మహత్య చేసుకొన్నాడు
వాట్సాప్ లో వచ్చిన అసభ్యకర సందేశాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చే.సుకొన్నాడు. రైలు కింద పడి చనిపోతున్నామని కుటుంసభ్యులకు సెల్పీ దిగి పోటో పంపాడు. చివరి నిమిషంలో పట్టాల నుండి భార్యను తప్పించాడు. ఈ ఘటన మహరాష్ట
మహరాష్ట్ర : వాట్సాప్ లో వస్తోన్న వేధింపుల మేసేజ్ లతో మసస్థాపానికి గురై ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. చివరి నిమిషంలో తన భార్యను
ఈ ప్రమాదం నుండి తప్పించాడు. వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఆయన తన కుటుంబసభ్యులు సమాచారం పంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
సామాజిక మాథ్యమాల ద్వారా మంచి, చెడు రెండు ఉన్నాయి,.అయితే వాటిని ఏ రకంగా ఉపయోగించుకొంటే అదే రకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ లో ఓ కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడంతో వాటిని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు.

మహరాష్ట్రలోని కళ్యాణ ప్రాంతానికి చెందిన విశాల్ ఖడే తన భార్యచ వైష్ణవితో కలిసి ఈ నెల 22వ, తేదిన రైలు పట్టాలపై నిలబడి సెల్పీ తీసుకొన్నారు. ఈ సెల్పీ తన కుటుంబసభ్యులకు పంపారు. ఓ వ్యక్తి తమను వాట్సాప్ ద్వారా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు.
వాట్సాప్ లో అసభ్యకర మేసేజ్ లు పంపుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆయన ఆరోపించాడు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంటున్నామని ఈ సెల్పీని కుటుంసభ్యులకు పంపాడు.
రైలు కింద పడి చనిపోవాలని భావించారు. అయితే ఆఖరినిమిషంలో భార్యను పట్టాల నుండి తప్పించి తాను మాత్రమే ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మహరాష్ట్రలో సంచలనం కల్గించింది. విశాల్ కుటుంబానికి అసభ్యకర సందేశాలు పంపిన వ్యక్తి ఎవరనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications