హాజరుకండి: సీఎం హరీశ్ రావత్కు సిబిఐ సమన్లు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం సమయంలో సంచలనం సృష్టించిన స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది.
రాజకీయ సంక్షోభం సమయంలో రెబెల్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు హరీశ్ రావత్ డబ్బు ఆశ చూపినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో బహిర్గతమైన విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తమ ఎదుట హాజరుకావాలంటూ ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేసింది. తాజాగా మంగళవారం విచారణకు రావాలంటూ సోమవారం సమన్లు పంపింది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరిగి హరీశ్ రావత్ తిరిగి సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టిన తర్వాత సీబీఐ విచారణ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications