చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎన్ సీఎం, డిప్యూటీ సీఎం: అన్నాడీఎంకే ఇష్టం, వెంకయ్య

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయయలిత స్థానంలో మరెవరినైనా నియమించాలా ? ఉప ముఖ్యమంత్రిని నియమించాలా ? అనే విషయం అన్నాడీఎంకే పార్టీ నిర్ణయిస్తుందని, తామేమి జోక్యం చేసుకోమని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.

సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయకుడు తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీ.హెచ్. విద్యాసాగర్ రావును కలుసుకున్నారు. రాజ్ భవన్ చేరుకున్న వెంకయ్య నాయకుడు సుమారు రెండు గంటల పాటు గవర్నర్ విద్యాసాగర్ రావుతో మాట్లాడారు.

తమిళనాడు రాజకీయాల గురించి, జయలలిత ఆరోగ్యం విషయంలో ఇద్దరు చర్చించారు. తరువాత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీకి అధికారంలో ఉండటానికి సంపూర్ణ మెజారిటీ ఉందని స్పష్టం చేశారు.

Venkaiah Naidu meet Governor Vidhyasagara Rao in Chennai

అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న జయయలిత స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలా ? ఉప ముఖ్యమంత్రిని నియమించాలా ? అనే విషయం ఆ పార్టీ నాయకులు నిర్ణయిస్తారని చెప్పారు.

అంతే కాని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాని, తాము కానీ జోక్యం చేసుకోమని వెంకయ్యనాయుడు చెప్పారు. జయలలిత ఆరోగ్య వివరాలు తెలుసుకోవడానికి తాను ఆదివారం చెన్నై వచ్చానని అన్నారు.

తనకు గవర్నర్ విద్యాసాగర్ రావు చిరుకాల మిత్రుడని, మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని చెప్పారు. జయలలిత త్వరగా కొలుకుని చక్కటి పరిపాలన అందిస్తారనే నమ్మకం తనకు ఉందని వెంకయ్యనాయుడు వివరించారు.

English summary
AIADMK will decide on Deputy CM said Venkaiah Naidu, after meet with Governor Vidhyasagara Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X