Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపే: వెంకయ్య విజయం లాంఛనమేనా?

ఉఫరాష్ట్రపతి పదవికి ఈ నెల 5వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్‌డిఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు, యూపిఏ అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ పోటీలో ఉన్నారు. అయితే ఎన్‌డిఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు విజయం నల్లేరుపై నడకేనన

న్యూఢిల్లీ: ఉఫరాష్ట్రపతి పదవికి ఈ నెల 5వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్‌డిఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు, యూపిఏ అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ పోటీలో ఉన్నారు. అయితే ఎన్‌డిఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు విజయం నల్లేరుపై నడకేననే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

శనివారం సాయంత్రానికి భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలనుంది. పార్లమెంట్‌హల్‌లో శనివారం నాడు పోలింగ్ నిర్వహించనున్నారు.

ప్రస్తుతం ఎన్‌డిఏకు బలమెక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో యూపిఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం సాధించాల్సిందేననే అభిప్రాయాన్ని రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

 Vice-President poll tomorrow; result in evening

అయితే జెడి(యూ) మహకూటమితో తెగతెంపులు చేసుకొన్నా కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాలకృష్ణగాంధీకే ఓటు చేస్తామని ప్రకటించింది.

ఈ నెల 5వ, తేదిన ఉదయం10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ సాగుతోంది. ఈ పోలింగ్‌లో ఓటుహక్కును వినియోగించుకొనే ఎంపీలకు ప్రత్యేక పెన్‌ను ఉపయోగిస్తారు. పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

శనివారం రాత్రి 7 గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికకు విప్ జారీ చేయడానికి రాజకీయపార్టీలకు అవకాశం లేదు.

Recommended Video

    Venkaiah Naidu To Be First Vice President If Elected

    ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రెండు టర్మ్‌లు ఈ పదివిలో కొనసాగారు. ఈ నెల 10వ, తేదితో ఆయన పదవీకాలం ముగియనుంది.

    ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతి పదవితో పాటు , రాజ్యసభ ఎక్స్అఫిషియో చైర్మెన్, రాజ్యసభ, లోక్‌సభలో నామినేట్ సభ్యులను ఎన్నుకొంటుంది.

    లోక్‌సభ, రాజ్యసభల్లో 790 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. అయితే రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే బిజెపి ఎంపీ పాశ్వాన్‌కు ఈ ఎన్నికలో ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం లేదు. కోర్టు తీర్పు కారణంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు.

    545 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో బిజెపికి 281 మంది సభ్యులున్నారు. ఎన్‌డిఏ‌కు మద్దతు తెలిపే పార్టీలను కలుపుకొంటే బిజెపి బలం 338కు చేరింది. 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బిజెపి సభ్యుల బలం 56కు చేరింది.కాంగ్రెస్ పార్టీకి 59 మంది సభ్యులున్నారు.

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో రానున్న రోజుల్లో బిజెపి రాజ్యసభలో గణనీయంగా బలం పెంచుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్‌డిఏ సుమారు వందకు చేరువలో ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+