ఇదీ మన ఇండియా!: రైలే ఆగింది కానీ.. వాహనదారులు మాత్రం ఆగరు(వీడియో)
Recommended Video

న్యూఢిల్లీ: గత కొద్ది రోజుల క్రితం అమృత్సర్లో రావణ దహనం సందర్భంగా రైలు ప్రమాదానికి గురై 62 మంది మరణించిన ఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. నిర్వాహకుల నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం కారణంగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
రైలు పట్టాలపై ఉంటే ప్రమాదమని తెలిసినా.. అక్కడేవుండి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనం అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా జనాలు నిర్లక్ష్యాన్ని వీడకపోవడం గమనార్హం.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ వీడియోలో.. ఒక పక్క దారివ్వాలంటూ రైలు హార్న్ కొడుతోంది, మరోపక్క అక్కడి గార్డ్ వారిని కొద్దిసేపు ఆగండని వారిస్తున్నాడు.
ye mera india pic.twitter.com/rAbVmsjCue
— Dr. Gill (@ikpsgill1) October 22, 2018
కానీ, ఇవేవి అక్కడున్న వాహనదారుల చెవికెక్కడం లేదు. అయితే ఈ ఘటన వాస్తవంగా ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్గా మారింది. అందులో ప్రజలు ప్రవర్తిస్తోన్న తీరును చూస్తే మాత్రం ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు జరగవా? అనే సందేహం కలుగక మానదు. యే మేరా ఇండియా(ఇదీ మన భారతదేశం) అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేయడం గమనార్హం.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications