Viral video: ఆగ్రాలో అరాచకం, భార్యను విద్యుత్ స్థంభానికి కట్టేసి చితకబాదిన భర్త, మ్యాటర్ !
ఆగ్రా/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కుటుంబ సభ్యులు, బంధువులు పంచాయితీలు చేశారు. అయితే గొడవలు సర్దుమనుగకపోవడంతో ఆ గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. రాత్రి ఇంటిలో ఎం జరిగిందో ఏమో కానీ భర్త మాత్రం రెచ్చిపోయాడు. ఇంట్లో ఉన్న భార్యను జుట్టుపట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకుని వెళ్లాడు. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభానికి భార్యను కట్టేసిన భర్త ఆమెను చితకబాదేశాడు. గ్రామస్తులు, స్థానికులు చూస్తున్నా ఏమాత్రం పట్టించుకోని భర్త అతని భార్య బట్టలు కొంచెం చింపేసి ఆమెను చితకబాదడం కలకలం రేపింది. భార్యను విద్యుత్ స్థంభానికి కట్టి దాడి చేస్తున్న సమయంలో స్థానికులు కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. భర్తతో పాటు అతని తల్లి కూడా తనను చిత్రహింసలకు గురి చేస్తోందని భార్య కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
ఆగ్రాలో దంపతులు
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలోని సికంద్ర ప్రాంతంలో శ్యామ్ బీహారి అలియాస్ శ్యామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శ్యామ్ బీహార్ కుటుంబ సభ్యులు సెట్ చేసిన కుసుమా దేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న శ్యామ్ బీహారీ, కుసుమా దేవి దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.
భార్యను రోడ్డు మీదకు ఈడ్చేశాడు
రానురాను శ్యామ్ బీహార్, కుసుమా దేవి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శ్యామ్ బీహార్, కుసుమా దేవి దంపతుల మద్య పంచాయితీలు చేశారు. అయితే శ్యామ్ బీహార్, కుసుమా దేవి దంపతుల మద్య గొడవలు సర్దుమనుగకపోవడంతో ఆ గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయని సమాచారారం.
భార్యను విద్యుత్ ఫోల్ కు కట్టేసి ?
రాత్రి ఇంటిలో ఎం జరిగిందో ఏమో కానీ శ్యామ్ బీహారీ మాత్రం రెచ్చిపోయాడు. ఇంట్లో ఉన్న భార్య కుసుమా దేవిని జుట్టుపట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకుని వెళ్లాడు. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభానికి భార్య కుసుమా దేవిని కట్టేసిన ఆమె భ శ్యామ్ బీహారీ ఆమెను చితకబాదేశాడు. గ్రామస్తులు, స్థానికులు చూస్తున్నా ఏమాత్రం పట్టించుకోని శ్యామ్ బీహారీ అతని భార్య కుసుమా దేవి బట్టలు కొంచెం చింపేసి ఆమెను చితకబాదడం కలకలం రేపింది.
వీడియో వైరల్
శ్యామ్ బీహారీ అతని భార్య కుసుమా దేవిని విద్యుత్ స్థంభానికి కట్టి దాడి చేస్తున్న సమయంలో స్థానికులు కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. తన భర్త శ్యామ్ బీహారీ పాటు అతని తల్లి కూడా తనను చిత్రహింసలకు గురి చేస్తోందని కుసుమా దేవి కేసు పెట్టిందని, తల్లీ కొడుకు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని ఆగ్రాలోని సికంద్రా పోలీసులు తెలిపారు. ఆగ్రాలో భార్యను విద్యుత్ స్థంభానికి కట్టేసి ఆమె భర్త దాడి చెయ్యడం, వీడియో వైరల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.