Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైరల్ వీడియో: కన్నీళ్లు పెట్టుకున్న యోగి ఆదిత్యనాథ్..?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బయోపిక్ 'అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభలో బోరున ఏడ్చిన దృశ్యం కూడా ఇందులో ఒకటి. యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగంతో మాట్లాడిన అసలు వీడియో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు కొంత మంది ప్రజలు బయోపిక్‌లోని ఆ సన్నివేశాన్ని , అసలు వీడియోను పోల్చి చూస్తున్నారు. బయోపిక్ కంటే అసలు వీడియో ఎక్కువ భావోద్వేగంతో ఉందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ వీడియోలో యోగి ఆదిత్యనాథ్ ఇలా అంటున్నారు. "సమాజ సేవ కోసం నేను నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను వదిలి వచ్చాను. కానీ ఈరోజు నన్ను ఒక నేరస్తుడిగా చూస్తున్నారు." అంటూ 2007లో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నప్పుడు లోక్‌సభలో భావోద్వేగంతో ఏడ్చారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయ ప్రతీకారంతో తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Viral Video Public Compares Yogi Adityanath s Crying Scene in Biopic to Original Lok Sabha Footage

యోగి ఆదిత్యనాథ్ ఎందుకు ఏడ్చారు?
ఈ సంఘటన 2007 నాటిది, గోరఖ్‌పూర్‌లో అల్లర్లు జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నారు. అయితే అప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గోరఖ్‌పూర్‌లో జరిగిన హింస అప్పటి రాజకీయాల్లో చాలా గందరగోళం సృష్టించిన ఓ కీలక సంఘటన. ఈ హింసకు ప్రేరేపించారనే ఆరోపణపై యోగి ఆదిత్యనాథ్‌ను అరెస్టు చేసి.. 11 రోజులు జైలులో ఉంచారు. జైలు నుంచి విడుదలైన తర్వాత, మార్చి 2007లో లోక్‌సభలో తన భద్రత, రాజకీయ వేధింపుల గురించి మాట్లాడినప్పుడు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చారు. తాను ఒక సన్యాసిని అని, ప్రజలకు సేవ చేయడానికి తన కుటుంబాన్ని వదిలి వచ్చానని ఆయన చెప్పారు.

గోరఖ్‌పూర్‌లో హింస ఎందుకు జరిగింది?
2007 జనవరి 27న మొహర్రం ఊరేగింపు సందర్భంగా గోరఖ్‌పూర్‌లోని దివాన్ బజార్ ప్రాంతంలో రాజ్‌కుమార్ అగ్రవాల్ అనే యువకుడిని కొందరు కత్తి, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత నగరంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగి, అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ కుశీనగర్‌లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన నిరసన ప్రదర్శన, ధర్నా చేస్తానని ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్ తన మద్దతుదారులతో గోరఖ్‌పూర్‌కు తిరిగి వస్తుండగా.. పోలీసులు ఆయనను పట్టణంలోకి ప్రవేశించకుండానే అరెస్టు చేశారు. అల్లర్లను, హింసను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ 11 రోజులు జైలులో ఉన్నారు. జైలు నుండి విడుదలైన తర్వాత, మార్చి 2007లో లోక్‌సభలో తన భద్రత, రాజకీయ వేధింపుల గురించి మాట్లాడినప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు.

గోరఖ్‌పూర్ హింస యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన మద్దతుదారులలో ఒక బలమైన హిందూవాది నాయకుడిగా నిలబెట్టింది. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన సహచరులపై అనేక కేసులు నమోదు అయ్యాయి. వీటిపై అనంతరం న్యాయపరమైన చర్యలు కొనసాగాయి. ఈ హింసకు ప్రధాన నిందితుడు మహ్మద్ షమీమ్.. అతడిని తర్వాత అరెస్టు చేసి జీవిత ఖైదు విధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+