శశికళ బినామి కంపెనీలపై కేంద్రం నిఘా: వ్యాపార రంగానికి దూరం చెయ్యాలని ప్లాన్!
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టి తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడి చివరికి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు మళ్లీ సినిమా కష్టాలు మొదలైనాయి.
అనేక బినామీ కంపెనీల్లో భాగస్వామ్యం ఉన్న శశికళను త్వరలో బ్లాక్ లిస్ట్ లోకి చేర్చే అవకాశం ఉందని వెలుగు చూసింది. బినామీ కంపెనీల్లో భాగస్వామ్యం ఉన్న అనేక మంది ప్రముఖుల పేర్లను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. దేశ వ్యాప్తంగా అనేక మంది బినామీ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత అధికారంలో ఉన్న సమయంలో ఆమెను అడ్డం పెట్టుకుని శశికళ అనేక అక్రమాస్తులు సంపాధించారని, అనేక బినామీ కంపెనీల్లో భాగస్వామ్యం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బినామీ కంపెనీల గురించి కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.
బినామీ కంపెనీలను అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాధిస్తున్న సీఈవోలు, డైరెక్టర్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఆ జాబితాలో శశికళ పేరు ఉందని సమాచారం. శశికళ బినామి కంపెనీలు గుర్తించి ఆమెను వ్యాపార రంగంలో అనర్హురాలిని చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం భావించిందని తెలిసింది.
శశికళకు మద్యం వ్యాపారం కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. శశికళ వదిన ఇళవరసి కుమారుడు వివేక్ కు చెందిన జాజ్ సినిమాస్ సైతం శశికళ బినామీ సంస్థ అని ప్రచారంలో ఉంది. ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం ఉందని సమాచారం.కేరళ మాజీ ముఖ్య మంత్రి ఉమెన్ చాందీ సైతం బినామీ కంపెనీల జాబితాలో ఉండటం కొసమెరుపు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications