viral:స్కూల్ భవనం ఇలా.. శిథిలావస్థకు చేరి.. వీడియో వైరల్
వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. ఉత్తరాదిలో కూడా జోరు వాన పడుతోంది. దీంతో జనం ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వర్షాలతో పురాతన భవనాల కింద ఉండటం అంటే ఓ సాహసమే.. ఇళ్లు అయితే ఖాళీ చేసి వెళతారు. మరీ స్కూల్ అయితే జర కష్టమే.. అవును ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వాటిని మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది.
ఉత్తరప్రదేశ్ అమ్రోహాలో ఓ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. అయినప్పటికీ వారికి విద్యాబుద్దులు నేర్పిస్తున్నారు. స్కూల్ పరిస్థితిని హెడ్ మాస్టర్ వీడియో తీశారు. ప్రైమరీ స్కూల్ సిచుయేషన్ ఇదీ అని అంటున్నారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
#WATCH | 113 Students' Lives At Risk, Attend Dilapidated School In Uttar Pradesh's #Amroha#School #YogiAdityanath pic.twitter.com/WzMlEgBDCb
— Mirror Now (@MirrorNow) August 2, 2022
వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు. స్కూల్ బిల్డింగ్ మార్చాల్సింది అని కోరుతున్నారు. విద్యార్థుల పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నారు. కూలిపోతే ప్రమాదం బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల భవిష్యత్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉందన్నారు. కానీ పట్టించుకోకుంటే ఎలా అని అడుగుతున్నారు. వారికి ఏమైనా అయితే ఎవరూ బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత ముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.