మెమెన్కి ఉరిశిక్ష అమలు: రాత్రి తిన్లేదు, నిద్రపోలేదు!
నాగపూర్: యాకూబ్ మెమెన్కు ఆయన పుట్టిన రోజు నాడే, గురువారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. యూకూబ్ మెనన్ రాత్రి నిద్రపోలేదు. ఎవరితోను మాట్లాడలేదు.
అధికారులు వన్ ఇండియాతో మాట్లాడారు. అతను చాలా తక్కువగా మాట్లాడాడని, తనకు ఉరి శిక్ష ఖాయమని అతనికి రాత్రి అర్థమయిపోయిందని చెప్పారు.
యాకూబ్ మెమెన్కు ఉరిశిక్ష నుంచి విముక్తి లభిస్తుందని చివరి వరకు భావించిన అతని కుటుంబ సభ్యులను, అతను చివరిసారిగా చూడాలనుకున్నారని చెప్పారు. ఉరిశిక్ష విషయమై తన తరఫు న్యాయవాది చెప్పినప్పుడు అతనితో చాలా కష్టంగా మాట్లాడారని చెప్పారు.

కాగా, ఉరిశిక్షకు ముందు రోజు జైలు అధికారులకు చాలా క్లిష్టమైన రోజు అని చెప్పవచ్చు. బుధవారం మొత్తం యూకూబ్ మెమెన్ ఉరి శిక్ష పైన డ్రామా నడిచింది. జూలై 29 బుధవారం నాడు సుప్రీం కోర్టు మెమెన్ పిటిషన్ను తిరస్కరించింది. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు.
మరోవైపు ఢిల్లీలో మెమెన్ ఉరిశిక్ష రద్దు పైన అర్ధరాత్రి వరకు చివరి ప్రయత్నాలు చేశారు. అర్ధరాత్రి తర్వాత సుప్రీం కోర్టు అసాధారణంగా విచారించింది. రోజంతా అనేక మలుపులు తిరిగింది.
మెమెన్ రాత్రి 11.40 గంటలకు మరోసారి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అర్ధరాత్రి త్రిసభ్య బెంచ్ వేసి, దానిపై మూడున్నర గంటల నుంచి నాలుగున్నర, అయిదు గంటల వరకు విచారణ జరిగింది. న్యాయస్థానం యాకూబ్ మెమెన్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో ఉరి ఖాయమైంది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications