పబ్లిక్గా..: ఆరెస్సెస్ నిక్కర్ల పైన రబ్రీదేవి కామెంట్
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పైన విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్ వారు హాఫ్ నిక్కర్లు ఎందుకు వేసుకుంటారని ఆమె ప్రశ్నించారు.
వారు లాఠీలు పట్టుకోవడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు. ఆమె ఆదివారం నాడు ఆర్జేడీ జాతీయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆరెస్సెస్, బిజెపి వాళ్లు లాఠీ పట్టుకుంటారని, అలాంటి వారే తిరిగి తమను ప్రశ్నించడం విడ్డూరమన్నారు.

ఓ ర్యాలీలో ఆర్జేడీ కార్యకర్తలు లాఠీలు పట్టుకున్నారు. దీనిపై బిజెపి నేతలు చురకలు వేశారు. దీంతో రబ్రీదేవి స్పందిస్తూ.. ఆరెస్సెస్ వాళ్లు లాఠీలు పట్టుకుంటారని, కానీ బిజెపి నేతలు తమను విమర్శించడం ఏమిటని ఆమె అభిప్రాయపడ్డారు. బహిరంగంగా వారు హాఫ్ పాయింట్లు (నిక్కర్లు) వేసుకోవడం సిగ్గుచేటు అన్నారు.
బీహార్లో ఆర్జేడీ - జెడియు - కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. దీనిపై రబ్రీదేవి మాట్లాడుతూ... నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాగత్బందన్ మరో ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. అయితే, మనలో ఒకరు ఎదుగుతుంటే మరొకరు కాళ్లు లాగే ప్రయత్నం చేయవద్దన్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications