పబ్లిక్గా..: ఆరెస్సెస్ నిక్కర్ల పైన రబ్రీదేవి కామెంట్
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పైన విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్ వారు హాఫ్ నిక్కర్లు ఎందుకు వేసుకుంటారని ఆమె ప్రశ్నించారు.
వారు లాఠీలు పట్టుకోవడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు. ఆమె ఆదివారం నాడు ఆర్జేడీ జాతీయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆరెస్సెస్, బిజెపి వాళ్లు లాఠీ పట్టుకుంటారని, అలాంటి వారే తిరిగి తమను ప్రశ్నించడం విడ్డూరమన్నారు.

ఓ ర్యాలీలో ఆర్జేడీ కార్యకర్తలు లాఠీలు పట్టుకున్నారు. దీనిపై బిజెపి నేతలు చురకలు వేశారు. దీంతో రబ్రీదేవి స్పందిస్తూ.. ఆరెస్సెస్ వాళ్లు లాఠీలు పట్టుకుంటారని, కానీ బిజెపి నేతలు తమను విమర్శించడం ఏమిటని ఆమె అభిప్రాయపడ్డారు. బహిరంగంగా వారు హాఫ్ పాయింట్లు (నిక్కర్లు) వేసుకోవడం సిగ్గుచేటు అన్నారు.
బీహార్లో ఆర్జేడీ - జెడియు - కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. దీనిపై రబ్రీదేవి మాట్లాడుతూ... నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాగత్బందన్ మరో ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. అయితే, మనలో ఒకరు ఎదుగుతుంటే మరొకరు కాళ్లు లాగే ప్రయత్నం చేయవద్దన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications