నన్నే టార్గెట్ చేస్తున్నారేం: 'విషాదం'పై హేమమాలిని
లక్నో: మధురలో జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, అసలు అంశాన్ని పక్కదారి పట్టించి తనను ఎందుకు ఆడిపోసుకుంటున్నారని సినీ నటి, ఎంపీ హేమమాలిని అన్నారు. శనివారం మధురలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు హేమమాలిని నేతృత్వం వహించారు.
ఘటన జరిగిన వెంటనే దానిపై స్పందించకుండా ముంబైలో సినిమా షూటింగ్కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆమె విమర్శల పాలయ్యారు. ఓ వైపు సొంత నియోజకవర్గంలో ఇంత ప్రమాదం జరిగితే ఆమె ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందరూ తన ట్వీట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించే ముందు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిందన్నారు.
అక్కడున్న మూడు వేల మంది దగ్గర ఆయుధాలు ఉన్న విషయం పోలీసులకు తెలుసునని చెప్పారు. కానీ వాళ్లు ఈ దారుణ ఘటన జరగకుండా నివారించలేకపోయారన్నారు. ఘటనలో చనిపోయిన ఎస్పీ ముకుల్ ద్వివేదీ కుటుంబాన్ని హేమ పరామర్శించారు. మరోవైపు ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ నిష్పక్షపాత దర్యాప్తు జరిపిస్తామన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications