Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !
లక్నో/ఉత్తరప్రదేశ్: భర్తతో కాపురం చేస్తున్న భార్య ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేస్తూ ఆమె ప్రియుడి స్వీట్ ఇచ్చి భర్తకు ఉప్మా తినిపించింది. భార్య రొమాన్స్ కు భర్త అడ్డుపడటంతో భార్య ఏకంగా ప్రియుడి ఇంటికే వెళ్లిపోయింది. ప్రియుడి ఇంటిలో ఉంటూ మద్యం, డ్రగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేసింది. భార్యకు నచ్చచెప్పి ఇంటికి పిలుచుకుని వచ్చాడు. పక్కదారిపట్టిన భార్య మాత్రం మళ్లీ ప్రియుడితో జెండా ఎత్తేసింది, ఇకలాభం లేదని డిసైడ్ అయిన భర్త అతని బెస్ట్ ఫ్రెండ్ ని రంగంలోకి దింపి అతని సహాయం తీసుకున్నాడు.
ఢిల్లీ సీన్ రిపీట్
ఢిల్లీలో ప్రియురాలు శ్రద్దాను ఆమె ప్రియుడు హఫ్తాబ్ ఎంత భయంకరంగా హత్య చేశాడో అందరికి తెలిసిందే. ప్రియురాలు శ్రద్దాను 35 ముక్కలుగా నరికిన హఫ్తాబ్ చేతులు దుపులుపుకోవాలని ప్రయత్నించి అడ్డంగా చిక్కిపోయాడు. అలాంటి కేసు ఉత్తరప్రదేశ్ లో మరోకటి వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
భార్య కాపురం చేస్తూ భర్త హ్యాపీ
ఉత్తరప్రదేశ్ లోని సతారామ్ పూర్ జిల్లాలోని గులారిహా ప్రాంతంలో పంకజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన జ్యోతి అనే యువతిని పంకజ్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత పంకజ్, జ్యోతి దంపతులు సంతోషంగా కాపురం చేశారు.
ప్రియుడితో డ్రగ్స్ సేవిస్తూ భార్య ఎంజాయ్
పంకజ్ భార్య జ్యోతి ఓ యువకుడిని సెట్ చేసుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది, విషయం తెలుసుకున్న పంకజ్ అతని భార్య జ్యోతిని మందలించాడు. రానురాను ప్రియుడితో బయట తిరుగుతున్న జ్యోతి డ్రగ్స్ సేవించడం మొదలుపెట్టింది. ప్రియుడు డ్రగ్స్ తెచ్చి ఇవ్వడంతో జ్యోతి నిత్యం డ్రగ్స్ సేవించి మత్తులో మునిగిపోయింది.
ప్రియుడి ఇంటికే వెళ్లిపోయిన భార్య
భార్య జ్యోతి రొమాన్స్ కు ఆమె భర్త పంకజ్ అడ్డుపడ్డాడు. భర్త పంకజ్ టార్చర్ ఎక్కువ కావడంతో జ్యోతి ఏకంగా ప్రియుడి ఇంటికే వెళ్లిపోయింది. ప్రియుడి ఇంటిలో ఉంటూ మద్యం, డ్రగ్స్ సేవిస్తున్న జ్యోతి భర్త పంకజ్ ను పూర్తిగా మరిచిపోయిన జ్యోతి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండిపోయింది.
భార్యను చంపేయాలని డిసైడ్ అయిన భర్త
భార్య జ్యోతికి నచ్చచెప్పిన పంకజ్ మళ్లీ ఆమెను ఇంటికి పిలుచుకుని వచ్చాడు. పక్కదారిపట్టిన జ్యోతి కొన్ని రోజులు మాత్రమే భర్త పంకజ్ ఇంటిలో ఉండి తరువాత మళ్లీ ప్రియుడితో జెండా ఎత్తేసింది, ఇకలాభం లేదని డిసైడ్ అయిన పంకజ్ అతని ఫ్రెండ్ దర్జన్ అనే వ్యక్తితో కలిసి అతని భార్య జ్యోతిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
భార్యను పీస్ పీస్ చేసిన భర్త
నవంబర్ 8వ తేదీన డ్రగ్స్ సేవించి మత్తులో ఉన్న భార్య జ్యోతిని ఆమె బర్త పంకజ్ చంపేశాడు. తరువాత స్నేహితుడు దర్జన్ ు ఇంటికి పిలిపించుకుని అతని భార్య జ్యోతిని గుర్తు పట్టలేని విధంగా ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. భార్య జ్యోతి శరీరంలోని ముక్కలు నిర్జనప్రదేశంలో విసిరేసిన పంకజ్ తప్పించుకుని పారిపోయాడు.
ఫోరెన్సిక్ రిపోర్టుతో భర్త స్కెచ్ రివర్స్
భార్య జ్యోతిని గుర్తుపట్టలేని విధంగా హత్య చేసిన పంకజ్ తప్పించుకుని పరారైనాడు. మహిళ శరీర భాగాలు సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. హత్యకు గురైయ్యింది జ్యోతి అని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చారు. జ్యోతిని హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న ఆమె భర్త పంకజ్, అతని స్నేహితుడు దర్జన్ ను అరెస్టు చేశామని ఉత్తరప్రదేశ్ లోని సీతారామ్ పూర్ జిల్లా పోలీసులు చెప్పారు.