Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భర్త రీజనల్ మేనేజర్, రాత్రి ఇంటికి వెళ్లి చూసే సరికి, 15 ఏళ్తకు కాపురంలో ఏం జరిగిదంటే ?

అహమ్మదాబాద్/ చెన్నై: కుటుంబ సభ్యులు చూసి చేసిన పెళ్లితో దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. మంచి ఉద్యోగం చేస్తున్న భర్త 15 సంవత్సరాల క్రితం వేరే రాష్ట్రానికి వెళ్లి కాపురం పెట్టాడు. దంపతులు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారని, ఎలాంటి సమస్యలు లేదని వారి కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం లేదని, వారి మద్య సమస్యలు చాలా ఉన్నాయని ఆలస్యంగా వెలుగు చూసింది. తాను ఇంటికి వెళ్లే సమయానికి తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి. భార్య చనిపోయిన తరువాత తన కూతురి ఆత్మహత్యకు తన అల్లుడే కారణం అని, వివాహం జరిగిన 15 సంవత్సరాల తరువాత కట్నం కోసం తన కూతురిని వేధింపులకు గురి చెయ్యడం వలనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కొత్త కథ మొదలైయ్యింది.

 15 సంవత్సరాల క్రితం పెళ్లి

15 సంవత్సరాల క్రితం పెళ్లి

బీహార్ లోని వైశాలికి చెందిన సుజిత్ సింగ్ (36) అనే యువకుడికి బీహార్ కు చెందిన రుచి రాజ్ సింగ్ (35) అనే యువతికి వారి కుటుంబ సభ్యులు 15 సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి చేశారు. కుటుంబ సభ్యులు చూసి చేసిన పెళ్లితో సుజిత్ సింగ్, రుచి రాజ్ సింగ్దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

 అహమ్మదాబాద్ లో కాపురం

అహమ్మదాబాద్ లో కాపురం

సుజీత్ సింగ్ అహమ్మదాబాద్ లోని ఫార్మాస్యూటికల్ కంపెనీలో రీజనల్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం సుజీత్ సింగ్ అతని భార్య రుచి రాజ్ సింగ్ తో కలిసి అహమ్మదాబాద్ లో కాపురం ఉంటున్నాడు. ప్రతిరోజు సుజీత్ సింగ్ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. రుచి సింగ్ ఇంటిలోనే ఉంటున్నది.

 కుటుంబ సభ్యులకు షాక్

కుటుంబ సభ్యులకు షాక్

సుజీత్ సింగ్, రుచి రాజ్ సింగ్ దంపతులు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారని, ఎలాంటి సమస్యలు లేవని వారి కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే సుజీత్ సింగ్, రుచి రాజ్ సింగ్ దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం లేదని, వారి మద్య సమస్యలు చాలా ఉన్నాయని ఆలస్యంగా వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

ఆత్మహత్య చేసుకున్న భార్య

ఆత్మహత్య చేసుకున్న భార్య

ఆగస్టు 18వ తేదీన ఉదయం సుజీత్ సింగ్ ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఉద్యోగం ముగించుకున్న సుజిత్ రాత్రి ఇంటికి వెళ్లాడు. తాను ఇంటికి వెళ్లే సమయానికి తన భార్య రుచి రాజ్ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త సుజీత్ సింగ్ ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తరువాత రుచి రాజ్ సింగ్ అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి.

 ఇన్ని రోజులకు భర్త మీద కేసు

ఇన్ని రోజులకు భర్త మీద కేసు

రుచి రాజ్ సింగ్ చనిపోయిన ఐదు రోజుల తరువాత తన కూతురి ఆత్మహత్యకు తన అల్లుడు సుజీత్ సింగ్ కారణం అని, వివాహం జరిగిన 15 సంవత్సరాల తరువాత కట్నం కోసం తన కూతురిని వేధింపులకు గురి చెయ్యడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆత్మహత్య చేసుకునే ముందు రుచి సింగ్ అతని సోదరుడికిఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి విలపించిందని ఆమె తండ్రి కేదార్ నాథ్ సింగ్ సాహు అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కొత్త కథ మొదలైయ్యింది. పోలీసులు సుజీత్ సింగ్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+