Wife: భార్య పేరుతో రూ. 2 కోట్లకు ఇన్సూరెన్స్, కంత్రి మొగుడు ఏం చేశాడంటే ?, థ్రిల్లర్ సినిమా స్క్రిప్ట్ !
జైపూర్/రాజస్థాన్: వివాహం చేసుకున్న దంపతులు మొదటట సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతులు విడిపోయారు. భర్త మీద భార్య వరకట్నం వేధింపుల కేసు పెట్టింది, కోర్టులో విచారణ జరుగుతోంది. ఇంత జరిగిన తరువాత దంపతులు మళ్లీ టచ్ లోకి వచ్చారు. కజిన్ బ్రదర్ తో కలిసి భార్య గుడికి బయలుదేరింది. గుడికి వెళ్లి పూజలు చేసి ఇంటికి వెలుతున్న భార్యను వేగంగా వెళ్లిన ఓ వాహనం డీకొనడంతో ఆమె చనిపోయింది. హైవే మీద ప్రమాదం జరగడం, మహిళ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. తరువాత చనిపోయిన మహిళ పేరుతో రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని వెలుగు చూడటంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.
Singer: నాలుగు రాష్ట్రాలు, ఆరు మంది భార్యలు, ఈ సింగర్ పోటుగాడు, పైగా సిద్దాంతాలు, ఎలా చేశాడంటే ?
దంపతుల హ్యాపీలైఫ్
రాజస్థాన్ లోని జైపూర్ లో షాలు దేవి అలియాస్ షాలు (32) అనే మహిళ నివాసం ఉంటున్నది. 2015లో మహేష్ చంద్ర అనే వ్యక్తితో షాపు దేవి వివాహం జరిగింది. వివాహం చేసుకున్నమహేదష్ చంద్రా, షాలు దేవి దంపతులు మొదట చాలా సంతోషంగా కాపురం చేశారు. మహేష్ చంద్రా, షాలు దేవి దంపతులకు ఓ కుమార్తె ఉంది.
విడిపోయిన దంపతులు
కొన్ని సంవత్సరాల తరువాత రానురాను మహేష్ చంద్రా, షాలుదేవి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మహేష్ చంద్రా, షాలు దేవి దంపతులు విడిపోయారు. తన భర్త మహేష్ చంద్ర తనను కట్నం తీసుకురావాలని లార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ షాలు దేవి ఆమె భర్త మీద వరకట్నం వేధింపుల కేసు పెట్టింది, కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.
భార్యతో రాజీకి వచ్చిన భర్త
కోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలోనే మహేష్ చంద్ర అతని భార్య షాలు దేవితో రాజీ అయ్యాడు. ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నా టచ్ లోనే ఉన్నారు. మనం జీవితాంతం సుఖంగా ఉండాలంటే నువ్వు 11 రోజులు కచ్చితంగా గుడికి వెళ్లాలని మహేష్ చందరా అతని భార్య షాలే దేవికి చెప్పాడు.
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
భర్త మహేష్ చంద్రా చెప్పినట్లు అతని భార్య షాలు దేవి ఆమె సోదురడితో కలిసి ప్రతిరోజు గుడకి వెలుతోంది. గుడికి వెళ్లిన షాలు దేవి ఆమె సోదరుడితో కలిసి బైక్ లో ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో వేగంగా వెళ్లిన ఎస్ యూవీ వాహనం షాలు దేవి, ఆమె సోదరుడు వెలుతున్న బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు.
పోలీసులకు డౌట్
హైవే మీద ప్రమాదం జరగడం, షాలు దేవితో తోపాటు ఆమె సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఎవ్వరిక అనుమానం రాలేదు. పోలీసులు రోడ్డు ప్రమాదం అని కేసు నమోదు చేశారు. భార్య షాలు దేవి శవం మీదపడిన మహేష్ చంద్రా బోరున విలపించాడు. కోర్టులో కేసు ఉన్నా భార్య షాలు దేవి అంటే ఆమె భర్త మహేష్ చంద్రకు చాలా ఇష్టం అని అందరూ అనుకున్నారు. తరువాత అసలు కథ బయటకు వచ్చింది.
రూ. 2 కోట్లు ఇన్సూరెన్స్ కోసం ?
అంత్యక్రియులు పూర్తి అయ్యి గంట పూర్తి కాకుండానే మహేష్ చంద్ర మాయం అయ్యాడు. నేరుగా ఇన్సూరెన్స కంపెనీ దగ్గరకు వెళ్లిన మహేష్ చంద్ర తన భార్య షాలు దేవి చనిపోయిందని, ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించాలని మనవి చేశాడు. ఇదే విషయంలో మహేష్ చంద్రా పోలీసులకు చిక్కిపోయాడు.
కేసు తరువాత భార్య పేరుతో ఇన్సూరెన్స్
మహేష్ చంద్రా మీద అతని భార్య షాలు దేవి కేసు పెట్టడం, ఇద్దరూ విడిపోయిన తరువాత మహేష్ చంద్ర అతని బార్య పేరుతో రూ. 2 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించాడు. మామూలుగా భార్యను హత్య చేసినా ఫలితం ఉండదని మహేష్ చంద్రా ఇలాంటి స్కెచ్ వేశాడని, కిరాయి హంతకులతో రూ. 10 లక్షలు డీల్ మాట్లాడి కారుతో గుద్దించి భార్యను చంపేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.