Lok Sabha Election Result: బీజేపీ ఓడితే జరిగేది ఇదే ? ఇండియా కూటమి గెలిస్తే అలా..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఇప్పటికే ఆరు దశలు పూర్తయిపోయాయి. ఇక మిగిలింది జూన్ 1న జరిగే ఏడో దశ పోలింగ్ మాత్రమే. ఇది కూడా ముగియగానే అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈ ఫలితాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి, ఫలితాల బట్టి ఏమేం ప్రభావితం కాబోతున్నాయనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా దేశంలో స్టాక్, ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లను ప్రభావితం చేయబోతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో మార్కెట్లు చాలా అస్థిరంగా ఉన్నా తర్వాత మే నెలలో సానుకూలంగా మారడంతో క్రితం వారంలో గణనీయంగా కోలుకున్నాయి. నిఫ్టీ బెంచ్‌మార్క్ ఇప్పుడు 1.5 శాతం పెరిగింది. ఇది మే మధ్యలో 3 శాతం తక్కువగా ఉంది. సానుకూల ధోరణి కొనసాగితే, భారత మార్కెట్లకు ఇది వరుసగా నాలుగో నెల లాభాలు వచ్చినట్లవుతుంది.

will stock equity forex markets crash if bjp lost lok sabha election 2024

గతేడాది కాలంగా వెలువడిన అన్ని ఒపీనియన్ పోల్స్ లోనూ బీజేపీ 272 సీట్ల మ్యాజిక్ మార్క్ ను అధిగమించి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపడుతుందని తేలింది. ఎన్డీయే, మిత్రపక్షాలకు వచ్చే సీట్ల విభజనపై ఇప్పటివరకూ ఏ సర్వే కూడా నోరు విప్పడం లేదు. కానీ ఎన్డీయే తిరిగి అధికారం చేపడుతుందని మాత్రం చెప్తున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో పార్టీలు సాధించే సీట్లపై అంచనాలు విడివిడిగానే ఇస్తున్నారు. అలాగే ఇండియా కూటమి ప్రదర్శన ఈసారి మెరుగుపడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిస్తే ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది.

ఒకవేళ బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ సాధిస్తే, అది పెట్టుబడిదారులకు అండగా ఉంటుందని అంచనా. అంటే ప్రస్తుతం ఉన్న విధానాలు కొనసాగించవచ్చు. స్థూల-ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంతో పాటు సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారిస్తుంది. దిగువ సభలో దాని అధిక సీట్ల వాటా మరియు ఎగువ సభలో సీట్లు పెరుగుతున్నందున భూమి, శ్రమ, మూలధనంతో సహా ఉత్పత్తి కారకాల చుట్టూ మరింత రాజకీయంగా వివాదాస్పద సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశముంది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలను మూడు రకాలుగా విశ్లేషణ సంస్ధ నోమురా అంచనా వేసింది. బీజేపీ సొంతంగా విజయం సాధించి, ఎన్డీయేకు మొత్తంగా 400 సీట్లు వస్తే దేశీయ రంగాలు ముఖ్యంగా ఆర్థిక, వినియోగదారుల విచక్షణ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ రాణిస్తాయి. అలాగే ఐటీ సేవలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో షేర్లు పడిపోతాయి.

ఎన్డీయే పార్టీలన్నీ కలిపి మెజార్టీ మార్క్ అధిగమిస్తే పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రంగ సంస్ధల షేర్ల అమ్మకాలు ఖాయం. ఇది బ్యాంకింగ్, వినియోగం, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సానుకూలంగా ఉంటుంది. అలాగే ఇండియా కూటమి గెలిస్తే ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్స్యూమర్ విచక్షణ, ప్రభుత్వ రంగ సంస్థ షేర్ల అమ్మకాలు జరుగుతాయి. కన్స్యూమర్ స్టేపుల్స్, ఐటీ సర్వీసెస్, ఫార్మా సంస్థలకు సానుకూలంగా ఉంటుంది. బీజేపీ ఏకపక్ష విజయం సాధిస్తే రూపాయి బలపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+