మళ్లి గాల్లోకి ఎగరనున్న వింగ్ కమాండర్ అభినందన్, ఇప్పుడు ఏ యుద్ద విమానమో తెలుసా..?
Recommended Video
బాలాకోట్ దాడి తర్వాత పాకిస్థాన్కు బంధి అయిన తర్వాత అనుహ్యంగా భారత్కు చేరుకున్న వింగ్ కమాండర్ వర్థమాన్ అభినందన్ మరోసారి తన సత్తాను చాటేందుకు మిగ్ విమానాల పైలట్గా మారనున్నారు. ఆయన మరోసారి యుద్ద విమానాలను నడిపేందుకు ఫిట్నెస్ కల్గి ఉన్నాడని బెంగళూరులో ఉన్న ఎయిరో స్పేస్ ఇన్సిటిట్యూట్ సర్టిఫై చేసింది. దీంతో మరో పదిహేను రోజుల్లో మిగ్ 21 ఫైటర్లో విధులు నిర్వహించనున్నాడు.
పుల్వామా దాడి పరిణామాల తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన బాలాకోట్పై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. తదనంతరం ఫిబ్రవరి 27న ఎఫ్ 16 విమానాల ద్వార పాకిస్థాన్లోకి ప్రవేశించిన వింగ్ కమాండ్ అభినందన్ విమానం కూలిపోయి పాకిస్థాన్కు పట్టుబడ్డాడు. అనంతరం భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అభినందన్ తిరిగి భారత దేశానికి చేరుకున్న విషయం తెలిసిందే.

కాగా భారత చట్టాల ప్రకారం వర్థమాన్కు పలు పరీక్షలు నిర్వహించారు. శత్రు దేశానికి పట్టుపడడంతో పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత మళ్లి ఆయన్ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. దీంతో కొద్ది నెలల పాటు అభినందన్ తన పాత విధులకు దూరంగా ఉన్నాడు. కాగా ప్రస్థుతం శ్రీనగర్ ఎయిర్బేస్ లో ఉద్యోగం చేస్తున్న అభినందన్ కశ్మీర్ వ్యాలీలో నెలకోన్న భద్రత వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్నాడు. పదిహేను రోజుల తర్వాత తిరిగి తన పాత విధుల్లోకి చేరేందుకు అభినందన్కు సిద్దమవుతున్నాట్టు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications