భర్తకొడుకులను చంపేసి మహిళ ఆత్మహత్య
నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్ టిమ్కీ ప్రాంతంలో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. భర్తను, కుుమారుడిని గొంతు కోసి హత్య చేసి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. వారు నివసించే ఇంటి ముందు దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఈ సంఘటన వెలుగు చూసింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - నిషా (25), సర్వార్ ఆలం (35) దంపతులు కుమారుడు డాడు (5)తో కలిసి టిమ్కీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే తరుచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఘటనకు ముందు రోజు కూడా వారు ఘర్షణ పడ్డారని, పిల్లవాడి ఏడుగు కూడా బిగ్గరగా వినిపించిందని ఇరుగుపొరుగువారు పోలీసులకు చెప్పారు.

ఏమైందో తెలియదు గానీ భర్తను, కుమారుడ్ని మహిళ పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగినట్లు భావిస్తున్నారు. వాసనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సాయంత్రానికి వారు మరణించిన విషయం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications