కాబోయే భర్త హత్యపై యువతి డెమో చూపింది
చెన్నాై: కాబోయే భర్తను ఓ మహిళ ప్రియుడితో సహాయంతో హత్య చేయడమే కాకుండా హత్య చేసిన తీరును ఓ యువతి పోలీసులకు డెమో చూపించింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా చిత్తుకాడు గ్రామంలోని ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో ప్లాస్టిక్ డబ్బాలో తల వేరు చేసిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఈ కేసును ఛేదించడానికి ఎస్పబీ శ్యాంసన్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన వ్యక్తి చెన్నై పెరుంగుడి ప్రాంతానికి చెందిన హరికృష్ణన్ కుమారుడు రాజా (34)గా గుర్తించారు. ఇతను చెన్నైలోని యుటిఐ కంపెనీలో పనిచేస్తున్నాడు.
అతనికి కొరటూరు ప్రాంతానికి చెందిన సత్యతో ఆగస్టులో నిశ్చిత్రాథం జరిగింది. నవంబర్ 15వ తేదీన వివాహం జరగాల్సి ఉండింది. ఈ స్థితిలో రాజా నాలుగో తేదీన ప్లాస్టిక్ డబ్బాలో శవమై కనిపించాడు. రాజా కాల్ డేటా ఆధారంగా ఆవడికి చెందిన సగాయం, సత్య తదితరులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
విచారణలో సత్య, సగాయంలకు మధ్య పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ స్థితిలో రాజాను పెళ్లి చేసుకోవడానికి సత్య ఇష్టపడలేదు. దాంతో రాజాను హత్య చేసినట్లు సగాయం వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తీరుపై సత్య పోలీసులకు రెండు రోజుల క్రితం డెమో ఇచ్చింది. రాజాపై దాడి చేసిన వ్యక్తుల్లో ఉన్న ఆవడికి చెందిన మదన్ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.