వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జాబ్ ఇప్పిస్తానని కదుల్తున్న కారులో స్నేహితుడు రేప్
అతడు మరో ఇద్దరి ముందే ఆమె పైన అత్యాచారం చేశాడు. నిర్భయ ఘటన జరిగిన దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ ఘోరం జరిగింది. ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ సమీపంలో ఏడుస్తూ కనిపించిన ఆమెను స్థానికులు ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి బాధితురాలిని తీసుకెళ్లగా వైద్యులు అత్యాచారాన్ని ద్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తన స్నేహితుడు తనపై అత్యాచారం చేయబోగా తాను ప్రతిఘటించే ప్రయత్నం చేశానని, అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు... మొత్తం ముగ్గురు కలిసి తనను కొట్టారని పోలీసులకు బాధితురాలు చెప్పారు. బాధితురాలు సాయంత్రం సమయంల అతనిని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం కలిసిందని పోలీసులు చెప్పారు.
Comments