ఖాళీ కంపార్టుమెంట్లో స్త్రీకి నిప్పు పెట్టిన వ్యక్తి
కాలిన గాయాల మంటలకు కేకలు పెడుతూ కపార్టెంటు నుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన ఆమెను ఇతరులు చూశారు. రైలు ఎక్కడానికి వచ్చినవారికి ఆమె అలా కనిపించింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున 4 గంటల 40 నిమిషాలకు జరిగింది. రైలు ఉదయం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉంది.
సంఘటనకు ముందు ఆ మహిళ, మరో వ్యక్తి ప్లాట్ఫారంపై గొడవ పడడాన్ని చాలా మంది చూశారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసాలోని మద్యాన్ని ఆమెపైకి ఒంపి, ఆ వ్యక్తి నిప్పంటించి ఉంటాడాని భావిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కొఝికోడ్ జిల్లాకు చెందిన ఫాతిమాను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొఝీకోడ్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
ఫాతిమా శరీరం 40 శాతం కాలిపోయింది. ఈ సంఘటనతో ఆ కంపార్టుమెంటును రైలు నుంచి వీడదీశారు. ఆ కంపార్టుమెంటును వదిలేసి రైలు ముందుకు వెళ్లిపోయింది. కంపార్టుమెంటులోని రెండు సీట్లు కూడా కాలిపోయినట్లు రైల్వే వర్గాలు చెప్పారు.