అసంఘటిత కార్మికుల కోసం పెన్షన్..! ఎవరు అర్హులు..? ఎలా పొందాలి..?
ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలోని అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో బ్రుహత్కర పథకాన్ని ప్రవేశ పెడుతోంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా 3 వేల రూపాయల పింఛను ఇచ్చే 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్' పథకం ప్రారంభం కానుంది. జీవిత చరమాంకంలో సామాజిక భద్రత, పనిచేసే శక్తి లేక నిస్సహాయులుగా ఉంటున్న అసంఘటితరంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.30 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర కార్మికశాఖ అంచనా. ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 40 ఏళ్ల లోపు కార్మికులు అర్హులు.

ఎవరు అర్హులు..! ఎవరు అనర్హులు..!!
ఇళ్లల్లో పనిచేసే వారుతో పాటు రోజు కూలీలు, వ్యవసాయ కూలీలు, బీడీ, చేనేత, నిర్మాణరంగ కార్మికులు నెలవారీ వ్యక్తిగత ఆదాయం 15 వేల లోపు ఉన్నవారు (ఈ మేరకు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి) ఒక కుటుంబంలో ఎంతమందైనా చేరవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇతర పథకాల లబ్ధితో ఈ పథకానికి సంబంధం ఉండదు. ఇర ఈ పథకానికి వీరు అనర్హులు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఈఎస్ఐ పరిధిలోకి వచ్చేవారు, పీఎఫ్ ఖాతాలు ఉన్నవారు ఈ పధకం కిందకు రారు.

వయసును బట్టి ప్రీమియం..! ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు అంటే..!!
18 ఏళ్ల వయసున్న కార్మికుడు ఈ పథకంలో చేరితే ప్రతి నెలా 55 రూపాయలు చెల్లించాలి. 29 ఏళ్ల వారు 100, 40 రూపాయలు, 40 ఏళ్లున్న వారు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కార్మికులు చెల్లించేదానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమచేస్తుంది. ఇలా 60 ఏళ్ల వరకూ చెల్లించిన తర్వాత ప్రతి నెలా 3వేల రూపాయల చొప్పున పింఛనుగా ఇస్తుంది.

ఈ పథకంలో ఎలా చేరాలి..! నియమాలు ఎలా ఉంటాయి..!!
ఈ పథకం దరఖాస్తుల సేకరణకు రాష్ట్ర కార్మికశాఖ ప్రయోగాత్మకంగా జిల్లాకు రెండు చొప్పున ఉమ్మడి సేవల కేంద్రాలు (కామన్ సర్వీస్ సెంటర్) ఏర్పాటు చేసింది. అనంతరం వీటిని మండల కేంద్రాలకు విస్తరించే యోచనలో ఉంది. కార్మికులు ఈ కేంద్రాల్లో ఆధార్కార్డు, బ్యాంకు పాసు పుస్తకాల నకలు ఇచ్చి వివరాలు నమోదు చేసుకోవాలి. మొదటి నెల చెల్లించాల్సిన ప్రీమియం నగదు రూపంలో చెల్లించాలి. ఆ తర్వాత నెల నుంచి నమోదు చేసిన బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుంది.

మధ్యలో మానేస్తే కొనసాగింపు ఉంటుందా..! ఏంటి పరిస్థితి..!!
ప్రీమియం చెల్లింపు మధ్యలో మానేస్తే అప్పటివరకూ చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇస్తారు.పథకంలో చేరిన కార్మికులు 60 ఏళ్ల లోపు మరణించినా లేక శాశ్వతవైకల్యానికి గురైనా, వారి జీవిత భాగస్వామి ఈ పథకాన్ని యధావిధిగా కొనసాగించవచ్చు. ఆసక్తి లేకుంటే అప్పటివరకూ చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు.ఒకవేళ కార్మికులు పింఛను తీసుకుంటూ మరణిస్తే, జీవిత భాగస్వామికి 50 శాతం పింఛను చెల్లిస్తారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications