ఆమెకు ప్రధాని అయ్యే అర్హతలున్నాయా, మీడియా వక్రీకరించింది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయని తాను అనలేదని ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా చెప్పారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు.
న్యూఢిల్లీ :;పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని తాను అన్నట్టు వచ్చిన వార్తలను ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా ఖండించారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన వివరణ ఇచ్చారు.
దీదీ ప్రధాని కావచ్చు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పానని ఆయన గుర్తుచేశారు. కాని , తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన చెప్పారు.

కాని, మమత బెనర్జీయే ప్రధానమంత్రి అవుతారని తాను చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. బెంగాల్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అయితే మీడియా వక్రీకరణ వల్లే ఈ ప్రచారం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అజెండా అజ్ తక్ కార్యక్రమంలో రాందేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ జీవితాన్ని గడిపే మమతను ఆయన అభినందించారు. ఇప్పటికీ ఆమె హావాయ్ చెప్పులు వేసుకొంటుంది, కాటన్ చీరెలను ధరిస్తోందని చెప్పారు. తాను నేలపై పడుకొంటే, ఆమె చిన్న ఇంట్లో జీవనాన్ని సాగిస్తోందని ఆయన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications