ప్రైవేట్ బ్యాంకుల షాక్: నగదు లావాదేవీలపై పరిమితి, మించితే ఛార్జీల మోత
నెలకు నాలుగు వరకు ఉచిత నగదు లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు.. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు ఆ పరిమితికి మించితే ఒక్కో లావాదేవీపై బుధవారం నుంచి రుసుముగా
న్యూఢిల్లీ: ప్రైవేటు బ్యాంకులు మరోసారి ఖాతాదారులకు మరో షాకిచ్చాయి. నెలకు నాలుగు వరకు ఉచిత నగదు లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు.. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు ఆ పరిమితికి మించితే ఒక్కో లావాదేవీపై బుధవారం నుంచి రుసుముగా కనీసం రూ.150 వసూలు చేస్తున్నాయి.
సేవింగ్, శాలరీ ఖాతాలకూ ఈ రుసుము వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒక సర్క్యులర్లో పేర్కొంది. థర్డ్ పార్టీ నగదు లావాదేవీలను ఈ బ్యాంకు రోజుకు రూ.25వేలకు పరిమితం చేయనుంది. ఐసీఐసీఐ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం.. హోం బ్రాంచిలో ఒక నెలలో తొలి నాలుగు నగదు లావాదేవీలకు రుసుము ఉండదు. ఆ తర్వాత నుంచి ప్రతి రూ.వెయ్యికి రూ.5 వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా నిర్ణయించింది.

అంతేగాక, థర్డ్ పార్టీ నగదు లావాదేవీల పరిమితిని రోజుకు రూ.50వేలుగా నిర్ణయించింది. హోం బ్రాంచి కాని వాటిల్లో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితమని ఐసీఐసీఐ తెలిపింది. ఆ తర్వాత నుంచి రూ.1000కి రూ.5 రుసుము వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా ఉంటుంది. నగదు స్వీకరించే యంత్రంలో నెలలో తొలి జమకు రుసుము ఉండదు. ఆ తర్వాత రూ. వెయ్యికి రూ.5 వసూలు చేస్తారు.
ఇక యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే.. తొలి ఐదు లావాదేవీలు లేదా రూ.10లక్షల నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు రుసుము ఉండదు. ఆ తర్వాత రూ.150 లేదా రూ.వెయ్యికి రూ.5 ఏది ఎక్కువయితే ఆ మొత్తం రుసుముగా వసూలు చేస్తారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుసుములు వసూలు చేస్తున్నయా లేదా అన్నదానిపై అధికారిక సమాచారం లేదు. ఇటువంటి రుసుములు వసూలు చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశమూ లేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. కాగా, బ్యాంకులు ఇలా నగదు లావాదేవీలపై పరిమితులు పెట్టి, రుసుములు వసూలు చేస్తుండటంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications