దారుణం.. యువతిపై 25 మంది కలిసి లైంగికదాడి.. ఎక్కడ అంటే..
కరోనా కోరలు చాస్తే.. కొందరు యువకులు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా లేడి కనిపిస్తే చాలు తినేద్దాం అని అనుకుంటున్నారు. హర్యానాలో జరిగిన ఘటన అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ యువతిపై 25 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పల్వాల్ జిల్లాలో ఈ నెల 3న ఘటన జరగ్గా బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగుచూసింది.
అయితే బాధిత యువతికి నిందితుడు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. స్నేహం మరింత ముదరడంతో కలుద్దామని యువతిని పిలిచి కిడ్నాప్ చేసి రామ్గఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.అక్కడ ఆ రాత్రి స్నేహితులతో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు. ఉదయం మరోమారు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బదార్పూర్ సరిహద్దు వద్ద వదిలేసి పరారయ్యారు. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా వేవ్ ఎక్కువగా ఉండగా.. అతనిని నమ్మి వస్తే లైంగికదాడి చేశాడు. స్నేహితులతో కలిసి రేప్ చేయించాడు. అంతేకాదు ఇతరులకు చెప్పొద్దు అని బెదిరించాడు. అందుకూ ఇన్నిరోజులు చెప్పకుండా ఉన్నది. చివరికీ వారి నుంచి వేధింపులు ఎక్కువ కాగా.. తప్పని పరిస్థితుల్లో యువతి పోలీసులను ఆశ్రయించారు. ఆ 25 మంది జాడ వెతికేపనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. తమలాగా మరొకరికి ఇలా జరగకూడదని బాధిత యువతి అంటున్నారు.