యూస్: పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు: ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
లాస్ఏంజెల్స్: అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. లాస్ఏంజెల్స్లోని అజుసా పోలింగ్ కేంద్రం వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎన్నికలు: 68-48తో ట్రంప్ కంటే హిల్లరీ ముందంజ
క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు భారీగా మోహరించారు. తాత్కాలికంగా పోలింగ్ నిలిపివేశారు. సమీపంలోని పోలింగ్ కేంద్రాలను కూడా మూసివేసి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

కాగా, ఈ కాల్పులకు పాల్పడింది ఓ మహిళగా గుర్తించారు పోలీసులు. భారీగా ఆయుధాలతో వచ్చిన ఆమె.. కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. అయితే, మరికొందరు కాల్పులు జరిపింది పురుషుడేనని పేర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన మంగళవారం సాయంత్రం 5.30గంటలకు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులపై కూడా 20రౌండ్ల కాల్పులు జరిపినట్లు అజుసా పోలీస్ చీఫ్ స్టీవ్ హంట్ తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఓ ఇంట్లో దూరాడని చెప్పారు. నిందితుడి కోసం వేట కొనసాగుతోందని తెలిపారు.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications