వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బస్సు: 15 మంది మృతి
ఇస్లమాబాద్: పొరుగు దేశమైన పాకిస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. నార్త్వెస్ట్ పాకిస్థాన్లో వరదల కారణంగా ఓ పెళ్లి బస్సు కొట్టుకుపోయి 15 మంది చనిపోయారు. వివరాల్లోకి వెళితే... ఆప్గనిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన లండి కోటాల్ ఏజెన్సీ పర్వత ప్రాంతం నుంచి ఓ పెళ్లి బస్సు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వరద ముంచుకు రావడంతో బస్సు కొట్టుకుపోయిందని స్థానిక అధికారి ఇక్బాల్ ఖాన్ తెలిపారు.
శనివారం నాటు చోటు చేసుకున్న ఈ సంఘటనలో బస్సులో కొంత మంది వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారని, మరికొంత మంది గాయాలు పాలయ్యారని తెలిపారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత 15 మంది మృతిదేహాలు మాత్రమే తమకు లభ్యమయ్యాయని పేర్కొన్నారు.

బస్సులో పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కూడా ఉన్నారా? అనే దానిపై స్పష్టత లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మందే ఉన్నారని తాము చెప్పలేమని, తమకు 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని వారు తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. కాగా జులై నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పాకిస్థాన్లో ఇప్పటివరకు 55 మంది మరణించినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలతో ముగిసే వర్షాకాల సీజన్లో భాగంగా వరదలు రావడం సహజమేనని అన్నారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications