బాత్రూంలో ఊపిరాడక ఆరుగురు మృతి
ఇండోనేషియా రాజధాని జకార్తాలో దోపిడీ దుండగులు ఓ ఇంట్లోని వారినిని బాత్రూంలో బంధించగా ఊపిరాడక వారిలో ఆరుగురు మృతి చెందారు.
జకార్తా: దోపిడీకి వచ్చిన వారు ఇంట్లోని వారిని చిన్న బాత్రూంలో బంధించిన ఘటనలో ఊపిరాడక ఆరుగురు మృతి చెందిన ఉదంతమిది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

కత్తులు, తుపాకులతో సోమవారం ఓ ఇంటికి దోపిడీకి వచ్చిన సదరు దుండగులు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు, పని వారు, డ్రైవర్ సహా మొత్తం 11 మందిని బాత్రూంలో బంధించగా ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతులలో తొమ్మిదేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు.
బాత్రూం గది అతి చిన్నగా ఉండడంతో ఊపిరాడక వీరిలో ఆరుగురు మృతి చెందగా, మరో 5 మంది కొనప్రాణంతో బయట పడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ అకృత్యం గురించి ఓ పౌరుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకొని బాత్రూం తలుపు విరగగొట్టి కొనప్రాణంతో కొట్టుకుంటున్న బాధితులను కాపాడారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంట్లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దోపిడీ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications