పెను విషాదం: తీరానికి కొట్టుకొచ్చిన 74మంది మృతదేహాలు
సముద్రంలో మరో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఐరోపాకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యధరా సముద్రంలో మునిగిపోయి 74 మంది మృతి చెందారు.
ట్రిపోలీ: సముద్రంలో మరో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఐరోపాకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యధరా సముద్రంలో మునిగిపోయి 74 మంది మృతి చెందారు. వారి మృతదేహాలు లిబియా రాజధాని ట్రిపోలీ పశ్చిమ తీరానికి చేరినట్లు రెడ్ క్రెసెంట్ సంస్థ మంగళవారం తెలిపింది.
తీరానికి సమీపాన ఉన్న హార్చా గ్రామానికి చెందిన కొందరు ధ్వంసమైన పడవలో మృతదేహాలను చూసి అత్యవసర సేవా విభాగాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది.
ఈ విషాదానికి సంబంధించిన చిత్రాలను సంస్థ సామాజిక మాధ్యమాల్లో పెట్టింది.

మృతదేహాలను తరలించేందుకు తగిన వాహనం తమవద్ద లేదని.. ఖననం చేసేందుకు అనువైన స్థలం కూడా లేదని పేర్కొంది. ఇంకా కొన్ని మృతదేహాలు తీరంలో ఉండగా.. మరికొన్ని జలాల్లో తేలియాడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
2011 విప్లవం తరువాత కల్లోలిత లిబియా నుంచి మనుషులను అక్రమంగా తరలించడాన్ని కొందరు లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారు. లిబియా పశ్చిమ తీరం నుంచి సముద్రం గుండా ఇటలీకి ఎక్కువగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వలసదారులను అడ్డుకునేందుకు యూరోపియన్ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications