పెను విషాదం: తీరానికి కొట్టుకొచ్చిన 74మంది మృతదేహాలు
సముద్రంలో మరో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఐరోపాకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యధరా సముద్రంలో మునిగిపోయి 74 మంది మృతి చెందారు.
ట్రిపోలీ: సముద్రంలో మరో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఐరోపాకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యధరా సముద్రంలో మునిగిపోయి 74 మంది మృతి చెందారు. వారి మృతదేహాలు లిబియా రాజధాని ట్రిపోలీ పశ్చిమ తీరానికి చేరినట్లు రెడ్ క్రెసెంట్ సంస్థ మంగళవారం తెలిపింది.
తీరానికి సమీపాన ఉన్న హార్చా గ్రామానికి చెందిన కొందరు ధ్వంసమైన పడవలో మృతదేహాలను చూసి అత్యవసర సేవా విభాగాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది.
ఈ విషాదానికి సంబంధించిన చిత్రాలను సంస్థ సామాజిక మాధ్యమాల్లో పెట్టింది.

మృతదేహాలను తరలించేందుకు తగిన వాహనం తమవద్ద లేదని.. ఖననం చేసేందుకు అనువైన స్థలం కూడా లేదని పేర్కొంది. ఇంకా కొన్ని మృతదేహాలు తీరంలో ఉండగా.. మరికొన్ని జలాల్లో తేలియాడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
2011 విప్లవం తరువాత కల్లోలిత లిబియా నుంచి మనుషులను అక్రమంగా తరలించడాన్ని కొందరు లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారు. లిబియా పశ్చిమ తీరం నుంచి సముద్రం గుండా ఇటలీకి ఎక్కువగా పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వలసదారులను అడ్డుకునేందుకు యూరోపియన్ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications