TurkyEarthQuake: హృదయాలను కదిలిస్తున్న దృశ్యాలు.. శిథిలాల నుంచి శిశువు వెలికితిత.. తల్లి మృతి..
భారీ భూకంపం దాటికి టర్కీ, సిరియా అల్లాడిపోయాయి. ఈ భారీ భూకంపం వల్ల భారీ ప్రాణ నష్టమే కాకుండా తీవ్ర ఆస్తి నష్టం కలిగింది. ఈ ప్రకృతి విపత్తుకు టర్కీ, సిరియాలో 7,800 మందికి పైగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ భవనాల శిథిలాల కింద ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ భూ కంపంతో తీవ్రంగా నష్టపోయిన టర్కీ, సిరియాను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి.

శిశువు
భవన శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన శిశువును రక్షించిన దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. శిథిలాల కింద ఓ గర్భవతి చిక్కుకుని శిశువుకు జన్మనిచ్చింది. ఆదే సమయంలో ఆమె మరణించింది. శిశువు బొడ్డు తాడుతో తల్లికి పట్టుకుని ఉంది. ఈ విషాదకర ఘటన ప్రతీ ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. "మేము త్రవ్వినప్పుడు మాకు ఒక వాయిస్ వినిపించింది.మేము దుమ్మును క్లియర్ చేశాం.బొడ్డు తాడు (చెదురుగా) ఉన్న శిశువును కనుగొన్నాము. బొడ్డు పేగును కత్తిరించి శిశువును బయటకు ఆసుపత్రికి తరలించాం" అని ఓ అధికారి తెలిపారు.

7.8 తీవ్రత
పసికందు ఆమె కుటుంబంలో అందురు మరణించారని.. ఆ శిశువు కుటుంబానికి చెందిన ఏకైక వ్యక్తిగా ఉన్నారు.
టర్కీ, సిరియాలో సోమవారం తెల్లవారుజామున 7.8-తీవ్రతతో భారీ భూకంపం సంభవించంది. టర్కిష్ నగరాలైన గాజియాంటెప్ మరియు కహ్రామన్మరాస్ మధ్య భూకంప కేంద్రానికి సమీపంలో భారీ విధ్వంసం జరిగింది.

రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్
ఈ విధ్వంసం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మంగళవారం 10 ఆగ్నేయ ప్రావిన్సులలో మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్, చైనా, గల్ఫ్ స్టేట్స్తో సహా డజన్ల కొద్దీ దేశాలు సహాయం చేయడానికి ప్రతిజ్ఞ చేశాయి. శోధన బృందాలు అలాగే సహాయక సామాగ్రి గాలిలో రావడం ప్రారంభించాయి. ఇప్పటికే భారత్ టర్కీకి సహాయ బృందాలను పంపాయి. మన బృందాలు అక్కడ సేవలు అందిస్తున్నారు.

టర్కీలో 5,434 మంది
"నేను శిథిలాల నుండి నా సోదరుడిని తిరిగి పొందలేను. నేను నా మేనల్లుడును తిరిగి పొందలేను. ఇక్కడ చుట్టూ చూడండి. దేవుడి కోసం ఇక్కడ రాష్ట్ర అధికారి ఎవరూ లేరు" అని టర్కీలోని కహ్రామన్మరాస్ నగరంలో అలీ సాగిరోగ్లు అన్నారు. టర్కీలో 5,434 మంది, సిరియాలో 1,872 మంది మరణించినట్లు తెలుస్తోంది. WHO అధికారులు
20,000 మంది వరకు మరణించవచ్చని అంచనా వేశారు.

23 మిలియన్ల మంది
భారీ భూకంపం వల్ల 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని WHO పేర్కొంది. టర్కీ, సిరియాకు సహాయం చేయాలని దేశాలను కోరింది. భూకంపం తరువాత, వాయువ్య సిరియాలోని జైలులో ఉన్నఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చెందిన ఖైదీలు తిరుగుబాటు చేశారు. 20 మంది తప్పించుకున్నట్లు తెలిసింది. భూకంపం ఎక్కువగా వచ్చే దేశాలలో టర్కీ ఒకటిగా ఉంది.

ఎర్జింకన్ ప్రావిన్స్
1939లో తూర్పు ఎర్జింకన్ ప్రావిన్స్లో 7.8 తీవ్రతతో వచ్చిన భూ కంపానికి 33,000 మంది మరణించారు. టర్కీ ప్రాంతంలోని డజ్సే 1999లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 17,000 మందికి పైగా మరణించారు. భారీ భూకంపలు దేశాన్ని ఇబ్బంది పెడతాయని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. టర్కీలో 16 మిలియన్ల జనాభా నివాసిస్తోంది.












Click it and Unblock the Notifications