కాబూల్ లో భారత్, జర్మనీ ఎంబాసీ వద్ద బాంబు దాడి ! మోడీ జర్మనీ పర్యటన, టెర్రర్ టార్గెట్ !
కాబూల్: కాబూల్ లోని భారత్, జర్మనీ దౌత్య కార్యాలయాలకు అతి సమీపంలో బుధవారం ఉదయం బాంబుపేలుడు జరిగింది. భారీ శభ్దంతో బాంబుపేలుడు జరగడంతో దట్టమైన పోగలు వ్యాపించాయి. కాబుల్ నగరం నడిబోడ్డన ఈపేలుడు జరగడంతో స్థానిక ప్రజలు హడలిపోయారు.
ఈ బాంబుపేలుడు జరిగిన ప్రాంతంలోని వంద మీటర్ల పరిదిలో ఉన్న భవనాల తలుపులు, కిటికీలు, అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని దట్టంగా వ్యాపిస్తున్న నల్లటి పోగలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Sound of explosion in Kabul Shashdarak pic.twitter.com/OxBVPjJKop
— Rahim Gul Sarwan (@rgsarwan) May 31, 2017
తాలిబన్, ఆల్ ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విదేశీ రాయబారి కార్యాలయాలను లక్షంగా చేసుకుని దాడులు చేశారని స్థానిక ఆర్మీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. భారత్, జర్మనీ రాయబారి కార్యాలయాలకు కేవలం 50 మీటర్ల దూరంలో బాంబు పేలుడు జరిగింది.
#Kabul #Blast right now pic.twitter.com/xBJS3QYxzZ
— Zmaryalai Abasin (@AbasinZ) May 31, 2017
భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీ పర్యటనలో ఉండగానే బాంబుపేలుడు జరిగింది. కాబూల్ లోని వివిధ దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్న ఈ ప్రదేశానికి జర్మన్ గేట్ ముఖ ద్వారంగా ఉంటుంది. జర్మన్ గేట్ సమీపంలోనే జర్మనీ, భారత్ రాయబార కార్యాలయాలు ఉన్నాయి.
Ten Districts in Kabul suicide attack near Afghan presidential occurred. pic.twitter.com/yglc4blELK
— Rashad Shams (@rashad_shams) May 31, 2017
విషయం గుర్తించిన అధికారులు వెంటనే ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఆ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాయబార కార్యాలయాలను లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి ఉంటారని స్థానిక ఆర్మీ అధికారులు అనుమానాం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో ఎవ్వరూ మరణించలేదని ఆర్మీఅధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications