భర్త ముందే ప్రియుడికి భార్య ఫోన్, భార్య గొంతు గుర్తుపట్టి భర్త ఇలా....
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. భర్త ముందే భార్య తన ప్రియుడికి పోన్ చేసింది. విషయాన్ని పసిగట్టిన భర్త ప్రియుడిని చంపేశాడు. ఈ ఘటన దుబాయ్ లో చోటుచేసుకొంది.
దుబాయ్:వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటన దుబాయ్ లో చోటుచేసుకొంది. ఈ విషయమై భార్యను ప్రియుడిని భర్త హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాలేదు.దీంతో కసితో భర్త ప్రియుడిని చంపేశాడు.
పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన తన దుబాయ్ లోని ఓ ఫుడ్ కోర్టులో కుక్ గా పనిచేస్తున్నాడు.అయితే ఆయన తనకు సహయకుడిగా ఓ వ్యక్తిని నియమించుకొన్నాడు.
అయితే తన భార్యకు, తన వద్ద సహయకుడిగా పనిచేసే వ్యక్తికి మద్య వివాహేతర సంబంధం నెలకొంది. దీంతో ఈ విషయాన్ని గమనించిన భర్త వారిని వారించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. కాని, వారి పద్దతిలో మార్పు రాలేదు.
ఓ రోజు తన భార్య తన సహయకుడికి పోన్ చేసింది.దీంతో తన సహయకుడు ఫోన్ లో బిగ్గరగా మాట్లాడుతున్నారు.అవతలి వైపు నుండి కూడ మాట్లాడే వ్యక్తి కూడ బిగ్గరగా మాట్లాడుతోంది.అయితే తన సహయకుడితో మాట్లాడుతోంది తన భార్య అని గుర్తించాడు ఆ వ్యక్తి.
దీంతో ఆగ్రహనికి గురైన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో తన సహయకుడి ఛాతీలో కత్తితో పొడిచాడు.దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.అక్కడి నుండి ఆయన పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఇతర ఉద్యోగులు ఆయనను పట్టుకొన్నారు.