దక్షిణాఫ్రికా నుండి నెదర్లాండ్స్కు 11 గంటల పాటు విమాన చక్రాల్లో దాక్కుని ప్రయాణించిన ఓ వ్యక్తి.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

దక్షిణాఫ్రికా నుండి నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లోని స్కిపోల్ విమానాశ్రయంలో దిగిన విమానచక్రాల్లో దాక్కుని ప్రయాణించిన వ్యక్తిని ప్రాణాలతో గుర్తించినట్లు డచ్ పోలీసులు తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుంచి నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్కి విమాన ప్రయాణానికి దాదాపు 11 గంటల సమయం పడుతుంది. అయితే ఈ కార్గో విమానం కెన్యాలోని నైరోబీలో ఒకసారి ఆగిందని సమాచారం.
ఎత్తైన ప్రదేశాలలో అతిభయకరమైన చలితో పాటు తక్కువ ఆక్సిజన్ ఉండటం కారణంగా సుదీర్ఘంగా విమాన చక్రాల్లో దాక్కుని ప్రయాణం చేయడం అసాధారణమైన సంఘటన.
ఆ వ్యక్తి వయసు, ఏ దేశస్థుడో ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు.
'విమానం ముందు చక్రాల విభాగంలో ఆ వ్యక్తి సజీవంగా కనిపించాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నపుడే ఆసుపత్రికి తరలించబడ్డాడు' అని రాయల్ డచ్ మిలిటరీ పోలీస్ ప్రతినిధి జోవన్నా హెల్మండ్స్ ఎఎఫ్పి వార్తా సంస్థకు తెలిపారు.
'అతను ఇంకా బ్రతికి ఉండటం చాలా గొప్ప విషయం ' అని ఆమె చెప్పింది.
సంఘటన స్థలంలో ఆ మనిషి శరీర ఉష్టోగ్రత పెరిగిందని, అంబులెన్స్ వచ్చే సమయానికి అతను ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగాడు అని డచ్ బ్రాడ్కాస్టర్ ఎన్ఓఎస్ పేర్కోంది.
కార్గోలక్స్ ఇటాలియా నడుపుతున్న విమానచక్రాల్లో దాక్కుని ఓవ్యక్తి ప్రయాణించాడని సరుకు రవాణా సంస్థ కార్గోలక్స్ ప్రతినిధి రాయిటర్స్కి పంపిన ఇమెయిల్లో ధృవీకరించారు.
ఫ్లైట్ డేటా ప్రకారం, ఆదివారం జోహన్నెస్బర్గ్ నుండి స్కిపోల్ వెళ్లే ఏకైక కార్గోలక్స్ సరుకు రవాణా విమానం కూడా నైరోబీలో ఆగింది. ఆ వ్యక్తి దక్షిణాఫ్రికాలో లేదా కెన్యాలో ఎక్కడ విమానం ఎక్కాడో తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి:
- బొబ్బిలి యుద్ధానికి 265 ఏళ్లు: ఆ రోజున ఏం జరిగింది?
- ఆన్లైన్ గేమ్స్ ఆడి కోటీశ్వరులు కావొచ్చు
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- రష్యా, యుక్రెయిన్: యుద్ధం వస్తే ఎవరి బలమెంత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications