బరితెగించిన పాక్, కాల్పులు: మహిళ మృతి
జమ్మూ: పాకిస్థాన్ సైన్యం బరితెగించింది. ఒక్క సారిగా భారత్ సైన్యం మీద కాల్పులకు పాల్పడింది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టడానికి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ సైన్యం బరితెంగిపు కారణంగా ఒక సామాన్య మహిళ ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.
బుధవారం ఉదయం 8.55 గంటల సమయంలో భారత సరిహద్దులోని అకునూర్ ప్రాంతంలో పాక్ సైన్యం ఒక్క సారిగా కాల్పులకు పాల్పడింది. ఆ సందర్బంలో అటు వైపు వెళుతున్న స్థానిక మహిళ శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్లడంతో మరణించింది.
మరో ఇద్దరికి గాయాలైనాయి. బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే గాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలైనాయని అధికారులు అన్నారు. జమ్మూ జిల్లాలోని అకునూర్ సరిహద్దు ప్రాంతానికి అధికారులు చేరుకున్నారు.
పాక్ సైనికులు పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడటం, కాల్పులు జరపడంతో సరిహద్దు ప్రాంతాలలో నివాసం ఉంటున్న స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు మరణించిన మహిళ వివరాలు సేకరిస్తున్నారు.