హమాస్ పెద్ద తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్
Israel: హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ ఈ ఏడాది భారీ పురోగతిని సాధించింది. ఈ రెండు మిలిటెంట్ గ్రూపుల మూలాలను కత్తిరించింది. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కమాండర్లు మొదలుకుని అనేకమందిని మట్టుబెట్టింది. 2023 అక్టోబర్ లో తమదేశంపై దాడికి దిగినందుకు ప్రతీకారాన్ని తీర్చుకోగలిగింది. అదే సమయంలో శాంతి ఒప్పందాలను సైతం కుదుర్చుకోగలిగింది గానీ అవి పెద్దగా ఫలించినట్లు కనిపించలేదు.
ఈ ఏడాది హమాస్ చీఫ్ కమాండర్ యాహ్యా సిన్వర్, ఆ తర్వాత అతని తమ్ముడు మహ్మద్ సిన్వర్ ను హతమార్చింది. ఈ ఏడాది మే 13వ తేదీన హమాస్ శిబిరాలపై నిర్వహించిన మిస్సైళ్ల దాడుల సందర్భంగా మహ్మద్ సిన్వర్ హతమైనట్లు ఇజ్రాయెట్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది అప్పట్లో. నాటి దాడుల్లో హతమైంది సిన్వరేనని నిర్ధారించుకుంది. గాజాలోని ఖాన్ యూనిస్ లో గల ఓ టన్నెల్ లో సిన్వర్ మృతదేహాన్ని గుర్తించామని ఐడీఎఫ్ వివరించింది.

సిన్వర్ సోదరుల మృతితో హమాస్ కు దాదాపుగా నాయకత్వం లేకుండా పోయిందనుకున్నప్పటికీ.. ఆ తర్వాత పలువురు హమాస్ కు నాయకత్వాన్ని వహించారు. వారిని కూడా మట్టుబెడుతూ వచ్చింది ఐడీఎఫ్.యాహ్యా తరువాత హమాస్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించాడు మహ్మద్. ఇజ్రాయెల్ పై ప్రతిదాడులకు సారథ్యాన్ని వహించాడు. సిన్వర్ తో పాటు రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానా కూడా మరణించాడు నాటి దాడుల్లో.
హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్. హెజ్బొల్లా, హమాస్..ఈ రెండింటినీ ఏకకాలంలో మట్టుపెట్టింది. లెబనాన్, గాజాల్లో మొత్తంగా 1,300లకు పైగా ఆయా మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై ఈ దాడులు సాగించింది
ఈ ఏడాది డిసెంబర్ నాటికి 67,806 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 1,70,066 మంది గాయపడ్డారు. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు అల్ జజీరా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలోని మొదటి దశ కాల్పుల విరమణకు ఈ ఏడాది అక్టోబర్ లో హమాస్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు ఆగలేదు.
మరో వైపు జూన్ 13న ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో భారీ వైమానిక దాడికి దిగింది. ఇరాన్ అణు కర్మాగారాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, ఉన్నత సైనిక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేంతో సహా ఇజ్రాయెల్ కు చెందిన పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్ క్షిపణి దాడులలో 24 మంది చనిపోగా, సుమారు 1,272 మంది గాయపడ్డారు. 8,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇరాన్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘర్షణలో అమెరికా కూడా రంగంలోకి దిగి, మూడు ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ప్రాంతీయ యుద్ధం భయాలు పెరిగాయి. ఈ సంక్షోభం సమయంలో చమురు ధరలు 6 శాతం వరకు పెరిగాయి. 12 రోజుల పాటు సాగిన భీకర దాడుల తర్వాత, జూన్ 24న ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
-
చైనాకు బిగ్ షాక్.. భారత్కు రష్యా క్రూడాయిల్ షిప్పులు యూ టర్న్!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications