Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విరుచుకుపడుతున్న తాలిబన్లు: పాకిస్తాన్ ఎఫ్ 16 కూల్చివేత- 19 ఆర్మీ పోస్టులపై కబ్జా

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య యుద్ధం తీవ్రతరమౌతోంది. అఫ్ఘానిస్తాన్‌లోని పలు నగరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పలు పేలుళ్లు సంభవించాయి. విమానాల శబ్దాలు వినిపించాయి. మిస్సైళ్ల మోతలతో ఉలిక్కిపడింది కాబుల్. మరో ప్రధాన నగరం కాందహార్ తో పాటు పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటోన్న పక్టికాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మెరుపుదాడులతో ఆప్ఘనిస్తాన్ నగరాలు అట్టుడికిపోయాయి.

దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం. సరిహద్దులపై విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన పలు క్యాంప్ లను స్వాధీనం చేసుకుంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన జేఎఫ్-17 పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని ఆఫ్ఘన్ బలగాలు కూల్చివేశాయి. తూర్పు, ఆగ్నేయ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నాలుగు గంటల ఆపరేషన్‌లో రెండు పాక్ సైనిక స్థావరాలు, 19 అవుట్‌పోస్టులు ధ్వంసం అయ్యాయి. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాయి.

Afghanistan Forces Shoot Down Pakistani Aircraft After It Entered Its Airspace Security confirms

మరో నాలుగు పోస్టుల నుండి పాకిస్తాన్ సైనికులు పారిపోయినట్లు టోలో న్యూస్ తెలిపింది. అనేక ఆయుధాలు, ఓ వార్ ట్యాంక్, సైనిక రవాణా వాహనాన్ని కూడా ఆప్ఘనిస్తాన్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. పాకిస్తాన్ నిర్వహించిన వైమానిక దాడుల్లో పలువురు మరణించారని, దీనికి ప్రతీకారంగా తాము ఎదురుదాడికి దిగినట్లు ఆఫ్ఘన్ ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది సైనికులు వీరమరణం పొందినట్లు పేర్కొంది. 11 మంది గాయపడ్డారు.

పాకిస్తాన్ సైనిక చర్యలో ఎనిమిది మంది ముజాహిదీన్లు ప్రాణత్యాగం చేశారని, మరో 11 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాక్ అవుట్‌పోస్టులను స్వాధీనం చేసుకున్న వీడియోలు ఆఫ్ఘన్ మీడియా విడుదల చేసింది. అలాగే- నంగర్‌హార్‌లోని శరణార్థి శిబిరంపై పాకిస్తాన్ జరిపిన క్షిపణి దాడిలో 13 మంది పౌరులు గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2,611 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్‌ను ఆఫ్ఘనిస్తాన్ గుర్తించకపోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

పాక్ సైనిక చర్యను దుస్సాహసంగా ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. మహిళలు, పిల్లలు హతమైనట్లు ఆరోపించింది. చాలా మంది పాక్ సైనికుల మృతదేహాలు తమ వద్ద ఉన్నాయని, కొందరిని సజీవంగా పట్టుకున్నామని ఆఫ్ఘన్ బలగాలు ప్రకటించాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్‌తో బహిరంగ యుద్ధాన్ని ప్రకటించారు. తమ సహనం నశించిందని, ఇప్పుడు బహిరంగ యుద్ధమేనని తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+