మాజీ భార్యను, ఆమె ప్రియుడ్ని, పిల్లలను కాల్చేశాడు
డౌగ్లాస్విల్లే: అమెరికాలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. కాల్పులకు తెగబడి తన మాజీ భార్యను, ఆమె ప్రియుడ్ని చంపేశాడు. మరో ఇద్దరు కూతుళ్లను కూడా కాల్చేశాడు. ఇద్దరు పిల్లలపై కూడా కాల్పులు జరిపాడు. అట్లాంటాలకు పశ్చిమాన 32 కిలోమీటర్ల దూరంలో గల డౌగ్లాస్విల్లేలోని మాజీ భార్య ఇంటికి వెళ్లి అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఓ కూతురిని వెంటాడి శనివారంనాడు ఆమెపైకి కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె అతని కూతురినేనని అధికారులు చెప్పారు. మాజీ భార్య, ఆమె ప్రియుడు, మరో కూతురు తలలపై అతను కాల్పులు జరిపాడని చెప్పారు. మరో ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో లైఫ్ సపోర్టుపై ఉన్నారు. నలుగురు పిల్లల వయస్సు కూడా ఏడు, 15 ఏళ్ల మధ్య ఉంటుంది.

ఇతర మృతులతో పాటు షూటర్ కూడా ఇంట్లో మరణించి కనిపించాడు. మరణించిన పిల్లల్లో ఒకరి వయస్సు 9 ఏళ్లు, మరొకరి వయస్సు 7 ఏళ్లు ఉంటుంది. గాయపడిన ఇద్దరు పిల్లల్లో ఒకరి వయస్సు 8, మరొకరి వయస్సు 15ఏళ్లు ఉంటుంది. నలుగురు పిల్లలు రెండు కటుంబాలకు చెందినవారు.
షూటర్ను 33 ఏళ్ల కెడ్రిక్ ప్రథార్గా గుర్తించారు. మరో ఇద్దరు మృతులు లటోయా ఆండ్ర్యూస్, జోసెఫ్ టెర్రీ బ్రౌన్. వీరిద్దరి వయస్సు కూడా అంతే ఉంటుంది.












Click it and Unblock the Notifications