అమెరికన్ రైతుల కన్నీళ్లు: భారత్-చైనా-రష్యా స్నేహబంధం శాపంగా మారిందా?

అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తున్న సుంకాల విధానం ఇప్పుడు అదే దేశానికి ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ వాణిజ్యంపై తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి అమెరికా విధించిన టారిఫ్‌లు, ఇతర దేశాలను తమకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవడానికి ప్రేరేపించాయి. ఫలితంగా అమెరికా క్రమంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒంటరిగా మిగిలిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఓ వైపు యూరోపియన్ దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు అమెరికాపై ఆధారపడకుండా పరస్పర వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటున్నాయి.

సోయాబీన్ వ్యాపారం.. అమెరికన్ రైతుల ఆవేదన
ఈ అంతర్జాతీయ వాణిజ్య మార్పులకు సోయాబీన్ వ్యాపారం ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది. అమెరికా ప్రపంచంలో రెండో అతిపెద్ద సోయాబీన్ ఉత్పత్తిదారు కాగా, చైనా అతిపెద్ద కొనుగోలుదారు. గతంలో చైనా అమెరికా నుంచి భారీగా సోయాబీన్ కొనుగోలు చేసేది. కానీ అమెరికా టారిఫ్ యుద్ధం ప్రారంభించిన తర్వాత.. చైనా తన కొనుగోలు విధానాన్ని మార్చుకుంది. ఇటీవల నివేదికల ప్రకారం.. చైనా సెప్టెంబర్-అక్టోబర్ నెలల కోసం అమెరికా నుంచి ఒక్క టన్ను సోయాబీన్‌ను కూడా కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోలేదు. జులైలో కూడా చైనా దిగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. తమ పంట అమ్ముడుపోక అమెరికాలోని సోయాబీన్ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాసి, చైనా వంటి అతిపెద్ద కొనుగోలుదారుని కోల్పోతే బతకడం కష్టమని హెచ్చరించారు.

American Farmers Tears Has the India-China-Russia Alliance Become a Curse for the US

బ్రిక్స్ కూటమి ప్రభావం
బ్రిక్స్ దేశాలు ఇప్పుడు ఆర్థిక సహకారాన్ని పెంచుకుంటూ అమెరికాపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయ్‌హాంగ్ మాట్లాడుతూ.. అమెరికా బెదిరింపు ధోరణిని అనుసరిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో చైనా భారత్‌కు అండగా ఉంటుందని అన్నారు. అదే విధంగా.. రష్యా డిప్యూటీ రాయబారి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ.. భారతదేశానికి అమెరికా మార్కెట్‌లో సమస్యలు ఎదురైతే.. రష్యా మార్కెట్ సిద్ధంగా ఉందని, భారత ఎగుమతులను స్వాగతిస్తామని తెలిపారు.

బ్రెజిల్‌కు లాభం: చైనా ఇప్పుడు అమెరికాకు బదులుగా బ్రిక్స్ దేశమైన బ్రెజిల్ నుంచి సోయాబీన్ దిగుమతులు భారీగా పెంచుకుంది. గత నెలలో చైనా మొత్తం సోయాబీన్ దిగుమతుల్లో దాదాపు 90 శాతం బ్రెజిల్ నుండి జరిగింది.

భారత్-చైనా-రష్యా సంబంధాలు మెరుగుపడుతున్నాయా?
అమెరికా విధానాల నేపథ్యంలో భారత్ కూడా తన వాణిజ్య సంబంధాలను విస్తరించుకుంటోంది. రష్యా నేతృత్వంలోని "యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU)"తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై చర్చలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా, భారత్-చైనా మధ్య గతంలో ఉన్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకుని, వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి అడుగులు పడుతున్నాయి. చైనా అరుదైన ఖనిజాలు, ఎరువులు వంటి వ్యూహాత్మక వస్తువులను సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. భారత ప్రభుత్వం కూడా చైనా వ్యాపార నిపుణులకు వీసా ఆంక్షలను సడలించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారత్, రష్యా, చైనాల మధ్య వాణిజ్య కూటమి బలపడుతోందనే సంకేతాలు ఇస్తున్నాయి, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త శక్తిగా ఉద్భవిస్తున్నట్లు సూచిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+