చైనా దారుణాలు..! స్కూల్లో ఉన్న చిన్న పిల్లలపై కత్తులతో దాడి ..! 8మంది విద్యార్థులు మృతి...!
స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులపై ఓ ఉన్మాదీ విచక్షణ రహితంగా వ్యవహరించాడు. ఒక్కసారిగా స్కూల్లోకి చొరబడి అభం శుభం తెలియని విద్యార్థులపై కత్తులతో వీరంగం సృష్టించాడు. దీంతో ప్రాధమిక పాఠశాలలో ఏం జరుగుతుందో తెలిసేలోపే రక్తపుటేరులు పారాయి. ఉన్మాది కత్తిపోట్లకు ఎనిమిది విద్యార్థులు బలయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు.
వామ్మో కొత్త ట్రాఫిక్ రూల్స్..! నిబంధనలు ఉల్లంఘించిన టూవీలర్కు రూ. 23000 జరిమానా...!
సెంట్రల్ చైనాలో ఈ దారుణం చోటుచేసుకుంది. హూబే ప్రావిన్స్లోని బైయాంగ్పింగ్ అనే ప్రాంతలో ఓ ప్రైమరీ పాఠాశాలలో కొత్త సెమిస్టర్ లో స్కూల్ ప్రారంభమైన మొదటి అనగా సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు 40 సంవత్సరాలు ఉండే ఓ మాజీ ఖైదీ స్కూల్లోకి చొరబడి విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే దాడికి పాల్పడ్డ నిందితుడు గతంలో ఓ దుర్మార్గానికి ఒడిగట్టాడు. తన ప్రేయసిపై దాడి చేసి ఆమే కళ్లను పీకేందుకు ప్రయత్నాలు చేశాడు. దీంతో ఆకేసులో ఎనిమిది సంవత్సరాల పాటు జైలు జీవీతం అనుభవించి సంవత్సరం క్రితమే బయటకు వచ్చాడు.అయితే నిందుతుడు ఎందుకు ఈదాడి చేశాడనే కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఇదే ప్రాంతలో గత సంవత్సరం కూడ విద్యార్థులపై దాడులు జరిగాయి. ఏప్రిల్ నెలలో ఇద్దరు విద్యార్థులను పోడిచి చంపగా, జూన్లో కూడ తొమ్మిది మందిపై దాడి చేసి చంపారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్ల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టాని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.