దాహం వేస్తుందని ఎయిర్పోర్టులో ప్రయాణికుడి మామిడి పండ్లు దొంగిలించిన ఉద్యోగి...! ఈనెల 23న తీర్పు
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఓ భారతీయ యువకుడు వింత కేసును ఎదుర్కోంటున్నాడు. ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న సంధర్భంలో దప్పిక వేసి ఓ ప్రయాణికుడి బ్యాగులో నుండి రెండు మామిడి పండ్లను దొంగిలించాడనే ఆరోపణలపై విచారణను ఎదుర్కోంటున్నాడు. గత రెండు సంవత్సరాలుగా కేసు విచారణ జరగనుండగా సెప్టెంబర్ 23న తీర్పు వెలువరించనుంది.
ఢిల్లీలో సరి-బేసి సంఖ్యల విధానం అవసరం లేదన్న నితిన్ గడ్కరీ..
అసలే దుబాయ్, ఆపైన అంతర్జాతీయ ఎయిర్పోర్టు,కోట్ల రుపాయల వ్యాపారులు ఆ దేశానికి వస్తూ పోతుంటారు. దీంతో భద్రత బాధ్యత చూడాల్సిన బాద్యత ఎయిర్పోర్టు అధికారులది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఎయిర్ పోర్టులో పనిచేసే ఓ 27 ఏళ్ల భారతీయ ఉద్యోగి కొంచం కక్కుర్తి పడ్డాడు. తనకు విపరీతంగా దాహం వేస్తుందడడంతో అక్కడి నుండి వచ్చే ఓ ప్రయాణికుడి బ్యాగులో నుండి ఓ రెండు మామిడి కాయాలు దొంగిలించాడు. అయితే తాను తీసుకున్న రెండు మామిడి పళ్ల వివరాలు సంబంధించి ప్రయాణికుడు ఎలాంటీ ఫిర్యాదు కూడ చేయలేదు. ఆయనపై దోంగతనం కేసు మాత్రం నమోదైంది.
అయితే ఉద్యోగి విమానాశ్రయంలోని ప్రయాణికుడి బ్యాగును ఓపేన్ చేసి తెరిచి చూస్తున్న విషయాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే కెమేరాల రోటిన్ చెకప్లో భాగంగానే రెండు మామిడి కాయలు తీస్తున్న దృశ్యాలు రికార్డ్ కావడంతో అక్కడి పోలీసులు ఉద్యోగిని పిలిపించి విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి దోంగతనం 6దీరమ్ల విలువ గల మామిడి పళ్లను దోంగించాడని కేసు నమోదు చేశారు. అయితే 2017 ఆగస్టులో కేసు నమోదు అయింది. కాగా కేసు తుది తీర్పు సెప్టెంబర్ 23న వెలువడనుంది.. కేసులో ఉద్యోగి దోషిగా తేలితే జైలు శిక్షతోపాటు జరిమాన కూడ విధించవచ్చని అక్కడి అధికారులు తెలిపారు.