పెను విషాదం: పడవ బోల్తాపడి 58 మంది మృతి
బాంగుయ్: ఆఫ్రికా దేశం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సెట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగుయ్లో చోటు చేసుకుంది. ప్రజలు ఓ గ్రామంలో అంత్యక్రియలకు మోకో నదిపై పడవలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఘటన జరిగిన 40 నిమిషాల్లోనే తాము అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది 50 మంది మృతదేహాలను వెలికితీసినట్లు సివిల్ ప్రొటక్షన్ డిపార్ట్ మెంట్ చీఫ్ థామస్ జిమాస్సే తెలిపారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

కాగా, ప్రమాద సమయంలో బోటులో 300 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్షసాక్షలు తెలిపారు. ఓ గ్రామ పెద్ద చనిపోవడంతో బాంగుయ్ కి 45 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.
మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత రెస్క్యూ సిబ్బంది రావడానికి 40 నిమిషాలు పట్టిందని.. అప్పటికే అక్కడ ఉన్న స్థానిక బోట్లో చేపలు పట్టేవారు పలువురిని కాపాడారని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన అనంతరం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మెరుగైన నదీ రవాణా భద్రత కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications