పెను విషాదం: పడవ బోల్తాపడి 58 మంది మృతి
బాంగుయ్: ఆఫ్రికా దేశం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సెట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగుయ్లో చోటు చేసుకుంది. ప్రజలు ఓ గ్రామంలో అంత్యక్రియలకు మోకో నదిపై పడవలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఘటన జరిగిన 40 నిమిషాల్లోనే తాము అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది 50 మంది మృతదేహాలను వెలికితీసినట్లు సివిల్ ప్రొటక్షన్ డిపార్ట్ మెంట్ చీఫ్ థామస్ జిమాస్సే తెలిపారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

కాగా, ప్రమాద సమయంలో బోటులో 300 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్షసాక్షలు తెలిపారు. ఓ గ్రామ పెద్ద చనిపోవడంతో బాంగుయ్ కి 45 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.
మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత రెస్క్యూ సిబ్బంది రావడానికి 40 నిమిషాలు పట్టిందని.. అప్పటికే అక్కడ ఉన్న స్థానిక బోట్లో చేపలు పట్టేవారు పలువురిని కాపాడారని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన అనంతరం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మెరుగైన నదీ రవాణా భద్రత కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications